టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కోపం వచ్చింది.ఎన్నికల సభలో కేసీఆర్ ని ఓ యువకుడు ప్రశ్నించడంతో… సహనం కోల్పోయిన ఆయన తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ… చికాకు పడ్డాడు.
అయితే అది కాస్తా ఇప్పుడు వైరల్ గా మారింది.అంతే కాదు ఇటువంటి సందర్భాల కోసం కాసుకొని కూర్చున్న కాంగ్రెస్ పార్టీ ఈ తతంగానికి సంబంధించిన వీడియోను కాస్త కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.ఇంతకీ విషయం ఏంటి అంటే…
ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ ఎన్నికల ప్రచార సభలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగిస్తుండగా ఓ యువకుడు లేచి ‘‘మైనారటీలకు 12 శాతం కోటా ఏమైంది?’’ అని ప్రశ్నించాడు.దీంతో సహనం కోల్పొయిన కేసీఆర్.నోర్మూసుకుని కూర్చో అంటూ ఆ యువకుడిని తిట్టిపోశారు.‘‘బాత్ కర్తే, బైఠో.కామోష్ బైఠో.వోహీ బారాహ్ పర్సెంట్ హై బోలే కామోష్ బైఠో… బైఠ్ జావో (ఏం మాట్లాడుతున్నావు.
నోరు మూసుకుని కూర్చో.ఆ 12 శాతం గురించే చెబుతున్నా.
నోరు మూసుకుని కూర్చో).నేను చెబుతా, ఎందుకు తొందరపడుతున్నావు? చెప్పానా.కూర్చో.నీ తండ్రికి చెబుతా.ఏం మాట్లాడుతున్నావ్’’ అని అన్నారు.తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
‘‘ఇంత కుసంస్కారమా? ప్రశ్నలడిగితే అవమానిస్తవా? ప్రజలు నీ పనోళ్ళా ముఖ్యమంత్రి కుర్చీలో నిన్ను కూర్సో బెట్టినందుకు సిగ్గుబడుతున్నది తెలంగాణ’’ అని కామెంట్ చేసింది.