ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీద తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి మరీ….వరుస వరుసగా… విమర్శల బాణాలు విసురుతూనే ఉన్నారు.
అసలు మనిషిలా మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు.చంద్రబాబు అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నారని ఇటువంటి సీఎం ని భరిస్తున్న ఆంధ్రా ప్రజలకు చేతులెత్తి మొక్కాలంటూ…కేసీఆర్ అన్నారు.
అసలు తాను ఎవరిని కలిస్తే చంద్రబాబు కి ఎందుకు అని ప్రశ్నించారు కేసీఆర్.
ఇండియాలోనే డర్టీయస్ట్ పొలిటీషియన్ ఎవరన్నా ఉన్నారా అంటే అది చంద్రబాబే అని ఎద్దేవా చేశారు.తాము ప్రతిపాదిస్తున్న అర్థిక నమూనాలపై చంద్రబాబుకు అవగాహన లేదని కేసీఆర్ విమర్శించారు.కల్యాణలక్ష్మి, పారిశ్రామిక రాయితీలను చంద్రబాబు కాపీ కొట్టారని అన్నారు.
అంతే కాదు సైబర్ టవర్స్కు పునాది వేసింది చంద్రబాబు కాదని.రాజీవ్గాంధీ, ఎన్.
జనార్దనరెడ్డి అని కేసీఆర్ వివరించారు.జనవరి 1 నుంచి హైకోర్టు విభజన ఉండబోతోందని ముందే తెలిసినా.
దానికి అనుగుణంగా… భవనాలు ఎందుకు సిద్ధం చేసుకోలేకపోయారన్నారు.చంద్రబాబు ఇన్నాళ్లూ ఎక్కడ పడుకున్నాడని మండిపడ్డారు కేసీఆర్.
చంద్రబాబు నోరు తెలిస్తే అబద్దాలు చెబుతుంటారని మండిపడ్డారు.