ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి అయోగ్ సమావేశం వర్చువల్ విధానం ద్వారా స్టార్ట్ అయింది.ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసిఆర్, జగన్ తో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్ లు పలువురు కేంద్ర మంత్రులు పాల్గొనడం జరిగింది.
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్, సీఈవో అమితాబ్ కాంత్ ఇంకా మరికొంత మంది ఉన్నత అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అదేవిధంగా పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ ఇద్దరు గైర్హాజరయ్యారు.
జరిగిన ఈ సమావేశంలో వ్యవసాయం అదేవిధంగా మౌలిక సదుపాయాలు ఉత్పాదక రంగం మరియు మానవ వనరుల అభివృద్ధి ఆరోగ్యం పోషకాహారం వంటి అంశాలపై చర్చ జరిపారు.గత ఏడాది అసలు నీతి అయోగ్ సమావేశం జరగకపోవడంతో తాజాగా జరిగిన సమావేశంలో చాలా విషయాలపై ప్రధాని మోడీ తో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చిస్తున్నారు.
.