తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సడెన్ గా తెలంగాణ రాజకీయ వర్గాలలో షర్మిల కలకలం రేపిన విషయం తెలిసిందే.అసలు ఎవరు ఊహించకుండా ఓ పత్రిక కథనంతో వెలుగులోకి వచ్చిన షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అంశాన్ని మొదట ఆ పత్రిక కథనాన్ని అందరూ పెద్దగా పట్టించుకోలేదనే చెప్పవచ్చు.
కాని తరువాత షర్మిల తెలంగాణ రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చే అంశాన్ని మీడియా ద్వారా తెలిపిన తరువాత ఆ పత్రిక కథనానికి బలం చేకూరింది.ఆ తరువాత జిల్లాల నాయకులతో షర్మిల భేటీ కావడం, పార్టీ ఏర్పాటు చేస్తే క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే పరిణామాలపై నాయకులతో సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.
అయితే ఆ తరువాత ఖమ్మం బహిరంగ సభ, నిరుద్యోగులకు తక్షణమే నోటిఫికేషన్ లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ 72 గంటల నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.
అయితే ఆ సమయంలో కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.
తెలంగాణలో దొరల పాలన సాగుతున్నదని, ప్రజలు రాజన్న రాజ్యం కోరుకుంటున్నారని విమర్శించడంతో కేసీఆర్ ను డిఫెన్స్ లో పడేయాలని, ప్రజల మద్దతు, నిరుద్యోగుల మద్దతు పొందాలని ప్రయత్నించింది.కాని షర్మిల చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాయి.
అయితే కేసీఆర్ పై విమర్శలకు టీఆర్ఎస్ నేతలు అంతర్గతంగా ఆగ్రహం వ్యక్తం చేసినా వ్యూహాత్మకంగా ఎవరినైనా దెబ్బ కొట్టగలిగే సత్తా ఉన్న కేసీఆర్ షర్మిలపై గురి పెట్టినట్టు తెలుస్తోంది.షర్మిల వేస్తున్న ప్రతి అడుగును గమనిస్తున్న కేసీఆర్ షర్మిలకు ఏవైతే అనుకూల అంశాలుగా మారుతున్నాయో వాటన్నింటిని షర్మిలకు ప్రతికూలంగా మార్చి షర్మిలను ముందుకెళ్ళ కుండా నిలువరించే అవకాశం కనిపిస్తోంది.