బిగ్ బాస్ సీజన్ 2లో అందరికంటే వివాదాస్పద వ్యక్తిగా వుంది, బిగ్ బాస్ విన్నర్ అయిన వ్యక్తి కౌశల్.కౌశల్ బిగ్ బాస్ లో వున్నప్పుడు అంతానికి అండగా చాలా మంది అభిమానులు కౌశల్ ఆర్మీ ఏర్పాటు చేసి అతనికి మద్దతుగా నిలబడ్డారు.
అలాగే వారే సోషల్ మీడియాలో కౌశల్ కోసం విస్తృతంగా కాంపైన్ చేసి కౌశల్ భారీ ఓటింగ్ తో గెలవడంలో సహకరించారు.ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత కౌశల్ ఆర్మీ కౌశల్ కి సపోర్ట్ గా నిలబడింది.
దీంతో కౌశల్ కూడా కౌశల్ ఆర్మీ పేరు బ్రాండ్ గా మార్చి సోషల్ సర్వీస్ చేయడానికి రెడీ అయ్యాడు.దాని తరుపున తనకి వచ్చిన బిగ్ బాస్ ప్రైజ్ మనీని క్యాన్సర్ బాధితుల కోసం విరాళంగా ఇచ్చేసాడు.
ఇదిలా వుంటే గత కొద్ది రోజులుగా కౌశల్ ఆర్మీ వాళ్ళలో చాలా మంది కౌశల్ కి వ్యతిరేకంగా మారి మీడియా చానల్స్ ముందుకి వచ్చి కౌశల్ వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు.బిగ్ బాస్ కౌశల్ వ్యక్తిత్వం అనేది కేవలం డ్రామా అని అది నిజమనుకొని మోసపోయామని, అతనో పచ్చి మోసగాడని, తన పేరుని వాడుకొని అందరి దగ్గర డబ్బులు వసూలు చేయడం, ఎవరైనా అతనికి ఎదురు తిరిగితే తన ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో దాడి చేయించడం చేస్తున్నాడని విమర్శించారు.
అయితే తాజాగా మీడియా సమావేశంలో కౌశల్ తనపై వస్తున్నా ఆరోపణలకి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసాడు.కావాలనే చాలా మంది తనని టార్గెట్ చేసి, కుట్ర పూరితంగా తన వ్యక్తిత్వాన్ని నాశనం చేస్తున్నారని ఇందులో తనీష్ పాత్ర కూడా వుందని విమర్శలు చేసాడు.
వాళ్ళందరూ నన్ను టార్గెట్ చేసి పెయిడ్ బ్యాచ్ తో తనని, తన భార్యని టార్గెట్ చేస్తున్నారని విమర్శలు చేసాడు.అలాగే తనపై చేస్తున్న ఆరోపణలకి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసాడు.