చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ కరోనా వైరస్ తెగ టెన్షన్ పెడుతోంది.కరోనా బారిన పడితే వైరస్ నుంచి కోలుకున్నా అనేక ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు ఉంటాయి.
ఇప్పటికే టాలీవుడ్ కు చెందిన పలువురు సినీ ప్రముఖులకు, బుల్లితెర నటులకు కరోనా నిర్ధారణ అయింది.అయితే బిగ్ బాస్ సీజన్ 2 తెలుగు విన్నర్ కౌశల్ మండాను సైతం కరోనా వైరస్ తెగ టెన్షన్ పెడుతోంది.
కౌశల్ దగ్గర పని చేస్తున్న డిజైనర్ కు కరోనా నిర్ధారణ కావడంతో కౌశల్ సైతం కరోనా పరీక్షలు చేయించుకున్నారు.అయితే పరీక్షల్లో రిజల్ట్ ఏం వచ్చిందనే విషయాన్ని మాత్రం కౌశల్ వెల్లడించలేదు.
మరోవైపు బిగ్ బాస్ సీజన్ 2 ద్వారా బాగానే పాపులారిటీని సొంతం చేసుకున్న కౌశల్ కు బిగ్ బాస్ తర్వాత సినిమా ఆఫర్లు ఎక్కువగా రాలేదు.మోడలింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ ద్వారానే కౌశల్ మండా బిజీగా ఉన్నారు.
వర్క్ తో బిజీగా ఉన్న కౌశల్ డిజైనర్ కు కరోనా నిర్ధారణ కావడంతో ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది.చాలారోజుల భార్య, పిల్లల దగ్గరకు వెళుతుండటంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని కౌశల్ చెప్పుకొచ్చారు.
కరోనా విషయంలో ముందుజాగ్రత్తలు తీసుకోవడం మంచిదేనని కౌశల్ మండా వెల్లడించారు.కౌశల్ మండా ప్రస్తుతం బ్లాక్ అనే మూవీలో హీరోగా నటిస్తున్నారు.
మరోవైపు బిగ్ బాస్ విన్నర్లకు ప్రేక్షకుల్లో గుర్తింపు బాగానే వస్తున్నా ఆశించిన స్థాయిలో సినిమా ఆఫర్లు మాత్రం రావడం లేదు.బిగ్ బాస్ విన్నర్లు సినిమాల్లో మాత్రం హీరోలుగా ప్రూవ్ చేసుకోలేకుండా ఉండటం గమనార్హం.
బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్ సైతం ఇప్పటివరకు కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటన చేయలేదు.సినిమాల్లో చిన్నచిన్న రోల్స్ ను దర్శకులు ఆఫర్ చేస్తున్నా ఆ ఆఫర్లకు అభిజిత్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని తెలుస్తోంది.