ఇంకొంచెం మసాలా అంటూ నాని హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ 2 క్లైమాక్స్ కి చేరుకుంది.మరొకసారి షో మొదలైనప్పటి వాతావరణం కనిపిస్తుంది షోలో.
కంటెస్టెంట్స్ అందరు హౌస్ కి రావడంతో స్పెషల్ గా ఉంది.ఆడియన్స్ సపోర్ట్ చూస్తుంటే కౌశల్ ఆర్మీ దెబ్బకి ఇంకెవ్వరు టైటిల్ విన్ అయినా ఊరుకోరు అనుకుంట.
కానీ ప్రస్తుతం నూతన నాయుడు రాసిన ఓ లెటర్ కౌశల్ ఫాన్స్ లో ఆందోళన కలిగిస్తుంది.ఇంతకీ ఏంటది.? అందులో ఏం రాసుంది? అనేది తెలియాలంటే వివరాలు చూడండి!
బిగ్ బాస్ హౌస్కి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ వచ్చారు.కాని రెండు సార్లు బిగ్ బాస్ హౌస్లో ఎంట్రీ ఇచ్చి, రెండు ఎలిమినేషన్లు ఎదుర్కొన్న నూతన్ నాయుడు మాత్రం హౌస్కి రాకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది.నూతన నాయుడు ఎందుకు రాలేదు అనుకుంటున్న బుల్లితెర ప్రేక్షకుల డౌట్ తీర్చడానికి నూతన నాయుడు ఒక లేఖ రాసారు.అందులో ఏముందంటే…
ప్రియమైన ప్రజానీకానికి నమస్తే. బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకూ అసంఖ్యాకమైన ఫోన్లు, మెసేజ్లు వస్తూనే ఉన్నాయి.నా పట్ల ఇంత అభిమానాన్ని, ఆదరణను చూపిస్తున్న మీ అందరికీ ఎలా ధన్యవాదాలు చెప్పాలో తెలియడం లేదు.
మీ అందరి అభిమానాన్ని సంపాదించుకోవడానికే నేను బిగ్ బాస్ షోలోకి వెళ్లాను.లక్షలాది మంది అభిమానులకు సంపాదించుకోగలిగాను.ఇంతకంటే ఏం కావాలి.బిగ్ బాస్ షో నుండి నేను అర్ధాంతరంగా బయటకు వచ్చేసినందుకు బాధ పడుతూ చాలామంది మెస్సేజ్లు పెడుతున్నారు.
ఫోన్లు చేస్తున్నారు.మీ అభిమానానికి సదా కృతజ్ఞుడ్ని.