బిగ్బాస్’ తెలుగు సీజన్ 2 ఆదివారం రాత్రితో ముగిసింది.బిగ్ బాస్ హౌస్లో ఉన్న 17 మందిని గెలుచుకోవడం ముఖ్యం కాదు.
కోట్లాది మంది ప్రేక్షకుల మనసుల్ని దోచుకోవడమే ముఖ్యం అని నిరూపించారు కౌశల్.బిగ్ బాస్ సీజన్ 2 ఫైనల్లో కోట్ల ఓట్లను కొల్లగొట్టి విజేతగా నిలిచారు.
వెంకటేష్ చేతుల మీదుగా బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ టైటిల్ అందుకున్నారు.
కౌశల్ పేరుతో ఆర్మీలు పుట్టుకొచ్చాయి.కౌశల్ ఫ్యాన్స్ పేరుతో హోల్టింగ్లు వెలిశాయి.ఆయన ఫ్యాన్స్ మాత్రమే కాకుండా చాలా మంది మహిళలు, పిల్లలు, పిల్లల తల్లులు కూడా కౌశల్ పేరుతో నిర్వహించిన 2కె రన్లో పాల్గొన్నారు.
స్టార్ హీరోలు కుళ్లుకునేలా కౌశల్ ఆర్మీ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి బిగ్ బాస్ నిర్వాహకులకు గట్టి సంకేతాలనే పంపింది.బిగ్ బాస్ అంటే కౌశల్.కౌశల్ అంటే బిగ్ బాస్ అన్న రేంజ్లో తోటి కంటెస్టెంట్స్ కుళ్లుకుని నువ్ బిగ్ బాస్వా? అని తింగరి మొహం వేసేలా డిక్టేటర్గా మారి టైటిల్ రేస్లో టాప్ 1 ప్లేస్లో నిలిచారు కౌశల్.
కౌశల్తోపాటు సింగర్ గీతా మాధురీ, తనీష్లకు కూడా ఓట్లు బాగానే వస్తున్నాయనే సమాచారంతో కౌశల్ ఆర్మీలో ఆందోళన నెలకొంది.
దీంతో వారంతా శనివారం రాత్రి హైదరాబాద్లో ‘బిగ్బాస్’ హౌస్ సెట్ వేసిన అన్నపూర్ణ స్టూడియోకు చేరినట్లు తెలిసింది.ఈ సందర్భంగా కౌశల్ను విజేతగా ప్రకటించాలంటూ నినాదాలు చేసినట్లు తెలిసింది.
కౌశల్ ఆర్మీ టీషర్టులు ధరించిన సుమారు 300 మంది అన్నపూర్ణ స్టూడియోకు చేరారని, కౌశల్.కౌశల్ అంటూ వారు చేసిన నినాదాల హోరు వల్ల షోకు కాసేపు ఆటంకం ఏర్పడినట్లు తెలిసింది.
శనివారం రాత్రే కౌశల్ను బిగ్బాస్ విజేతగా ప్రకటించారు.ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటకు వెళ్తున్న కౌశల్ కారు చుట్టూ గుమిగూడి, అభిమానులు కౌశల్ కౌశల్ అని నినాదాలు చేస్తున్న వీడియో ఒకటి ట్విట్టర్లో చక్కర్లు కొడుతోంది.