బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ ఎంత స్పీడ్గా అభిమానులను సొంతం చేసుకున్నాడో అంతే స్పీడ్గా విమర్శల పాలు అవుతున్నాడు, అంతే స్పీడ్గా ఆయన క్రేజ్ తగ్గిపోయింది.కౌశల్ అభిమానులు ఆర్మీ అంటూ ఏర్పాటు అయ్యి ఆయన్ను గెలిపించుకున్నారు.
వారంతా కూడా మొదట పెయిడ్ ఆర్మీ అంటూ విమర్శలు ఎదుర్కొన్నారు.కాని నిజంగానే కౌశల్పై అభిమానంతో చాలా మంది కౌశల్ ఆర్మీలో జాయిన్ అయ్యారు.
కౌశల్ గెలుపు కోసం విశేషంగా కృషి చేశారు.ఇప్పుడు వారంతా కూడా కౌశల్పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు.
తాజాగా కౌశల్ ఆర్మీ నుండి కొందరు బయటకు వెళ్లి కౌశల్పై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే.ఒక టీవీ ఛానెల్ కౌశల్ను ప్రధానంగా టార్గెట్ చేసి కథనాలు ప్రసారం చేస్తూ వచ్చింది.ఆ టీవీ ఛానెల్ గతంలో కౌశల్ చెప్పిన డాక్టరేట్, పీఎం ఫోన్ కాల్, గిన్నీస్బుక్ రికార్డుల మాటలను నిజం కాదని తేల్చింది.ఆ టీవీ ఛానెల్ తాజాగా కౌశల్ ఆర్మీ ఫౌండేషన్లో జరుగుతున్న లోటు పాట్లను కూడా బయట పెట్టింది.
మొత్తానికి కౌశల్ ఆర్మీ పెద్ద ఎత్తున కౌశల్పై ఆగ్రహంతో ఊగిపోవడానికి ప్రదాన కారణం ఆ ఛానెల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ నిధులను దుర్వినియోగం చేస్తున్నారంటూ వస్తున్న విమర్శలపై కౌశల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినా కూడా సదరు ఛానెల్ మాత్రం కౌశల్ ను ముమ్మాటికి ఒక మోసగాడు అంటూ నిరూపించే ప్రయత్నం చేసింది.తాజాగా ఆ ఛానెల్ వారు అందరు గొర్రెలే అనే ర్యాప్ సాంగ్ను తయారు చేయించింది.ఆ ఛానెల్కు సంబంధించిన అధికారిక యూట్యూబ్ ఛానెల్లో ఆ పాటను పోస్ట్ చేయడం జరిగింది.
కౌశల్ను నమ్మిన వారు అంతా కూడా గొర్రెలే అంటూ ఆ ఛానెల్లో ప్రసారం చేస్తున్నారు.ఆ పాట కౌశల్ క్రేజ్ను మరింత దెబ్బ తీసే విధంగా ఉంది.
మొత్తానికి ఆ ఛానెల్ కౌశల్తో చెడుగుడు ఆడేసుకుంటుంది.