టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికి పది మంది హీరోలు వరకు వచ్చారు.
అయితే వారిలో సక్సెస్ అందుకున్న వారు కొంతమందే అయిన కూడా మెగా ఫ్యామిలీ మీద ఇండస్ట్రీలో చాలా మంది పడి ఏడుస్తూ ఉంటారు.అలాగే మెగా ఫ్యామిలీ ఇండస్ట్రీలో చాలా మందికి సాఫ్ట్ టార్గెట్.
ఆ కుటుంబం మీద కాని, ఆ హీరోల మీద కాని ఎవరు ఎలాంటి కామెంట్స్ చేసిన పట్టించుకోరు.దీనిని అవకాశంగా తీసుకొని చాలా మంది వారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి హైప్ కావాలని, చూస్తూ ఉంటారు.
అలాగే ఈ మధ్య కాలంలో యుట్యూబ్ చానల్స్ గురించి చెప్పాల్సిన పని లేదు.మెగా ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్ పేరుని ఏదో ఒక విధంగా వాడుకొని చానల్ ప్రమోషన్ చేసుకుంటారు.
ఇక మెగా ఫ్యామిలీ మీద, పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత విమర్శలు చేసి భాగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో ప్రముఖంగా వినిపించే పేర్లు కత్తి మహేష్, శ్రీరెడ్డి.పవన్ కళ్యాణ్ ఇష్యూలో వీరికి మీడియా ఎక్కడ లేని ప్రాధాన్యత ఇచ్చి వారిని పెద్ద సెలబ్రిటీలని చేసింది.
ఇక వీళ్ళు అయితే ఇదేదో బాగుంది అని పవన్ కళ్యాణ్ మీద, మెగా ఫ్యామిలీ మీద విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు.వారిని ఎవరు పట్టించుకోవడం లేదు అనిపించినా ప్రతిసారి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయడం, మరోసారి వార్తలలోకి రావడం చేస్తూ ఉంటారు.
ఇప్పుడు శ్రీరెడ్డి కొత్తగా యుట్యూబ్ చానల్ పెట్టుకుంది.మీడియా ఇచ్చిన క్రేజ్ కారణంగా సినిమాలు పెద్దగా చేయకపోయినా పెద్ద సెలబ్రిటీగా మారిపోయి యుట్యూబ్ చానల్ కి ప్రమోషన్ పెంచుకుంది.
మరి ఈ ప్రమోషన్ సరిపోలేదని అనుకున్నారో ఏమో ఇప్పుడు ఈ చానల్ కోసం శ్రీరెడ్డి, కత్తి మహేష్ కలిసి ఇంటర్వ్యూ చేశారు.ఇక ఇందులో మొదటి నుంచి చివరి వరకు అంతా మెగా ఫ్యామిలీ, మెగా హీరోలు, పవన్ కళ్యాణ్ మీద విమర్శలతోనే సరిపెట్టి వాటిని ఆ వీడియోని ప్రమోషన్ చేసుకుంటున్నారు.
మరి దీనిపై మెగా ఫాన్స్, జనసేన కార్యకర్తలు రియాక్ట్ అయ్యే దానిని బట్టి చానల్ క్రేజ్ పెరుగుతుంది.వీళ్ళ ప్లాన్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుంది అనేది వేచి చూడాలి.
.