వైరల్ అవుతున్న స్టార్ హీరోయిన్ సొర చేప వీడియో... 

తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన మల్లీశ్వరి చిత్రంలో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియనివారుండరు.అయితే కత్రినా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా  ఉంటూ తన అభిమానులతో అందుబాటులో ఉంటోంది.

 Katrina Kaif, Bollywood Actress, World Ocean Day, Incredible Friend, Bollywood-TeluguStop.com

అయితే తాజాగా నిన్నటి రోజున వరల్డ్ ఓసియన్ డే కావడంతో ఓ వీడియోని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

అయితే ఆ వీడియోలో కత్రినా కైఫ్ సొర చేపతో కలిసి ఈత కొట్టింది.

ఈ క్రమంలో సొర చేప కి వరల్డ్ ఓసియన్ డే శుభాకాంక్షలు కూడా తెలిపింది.దీంతో సముద్ర జంతువులపై  కత్రినా కైఫ్ చూపిస్తున్న ప్రేమకు నెటిజన్లు ఫిదా అయ్యారు.

మామూలుగా భూమిపై జీవించేటువంటి జంతువులపై సెలబ్రిటీలు, ప్రముఖులు ప్రేమ చూపిస్తూ మరియు తెలియజేస్తూ ఉంటారని కానీ ఇలా సముద్ర జంతువులపై ప్రేమ చూపిస్తూ, ఇలా వినూత్నరీతిలో శుభాకాంక్షలు తెలియజేయడం కత్రినాకైఫ్ కే చెల్లిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరి కొందరు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా కత్రినా కైఫ్ ఇటీవలే బాలీవుడ్ ప్రముఖ సినీ దర్శకుడు రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన “సూర్యవంశీ” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది.

అయితే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు  పూర్తీ కావడంతో ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా కొంతకాలం పాటు ఈ చిత్ర విడుదలను చిత్ర యూనిట్ సభ్యులు తాత్కాలికంగా నిలిపి వేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube