ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల గురించి ఏదైనా ఓ విషయం సోషల్ మీడియా మాధ్యమాలలో వినిపించిందంటే చాలు కొంతమంది నిజానిజాలు తెలుసుకోకుండా వారిపై నెగటివ్ ట్రోల్స్ మరియు తప్పుడు వార్తలను సృష్టిస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ విషయంలో కూడా ఇలాగే జరిగింది.
అయితే ప్రస్తుతం కత్రినా కైఫ్ మహారాష్ట్ర రాజధాని అయినటువంటి ముంబై నగరంలో నివాసం ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే.దీంతో రాత్రి 10 గంటల సమయంలో బాలీవుడ్ ప్రముఖ సినీనటుడు విక్కీ విశాల్ ఆమె ఇంటికి ఇటీవలే వచ్చి వెళ్ళాడు.
ఇది గమనించిన ఇటువంటి కొందరు స్థానికులు విక్కీ విశాల్ వచ్చిన సమయంలో ఫోటోలు తీసుకుంటూ వాటిని సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేశారు.దీంతో అప్పటి నుంచి కత్రినా కైఫ్ కత్రినా కైఫ్ మరియు విక్కీ విశాల్ గురించి లేనిపోని కథలను అల్లుతూ సోషల్ మీడియా మాధ్యమాలలో ప్రచారం చేస్తున్నారు.
దీనిపై స్పందించిన కొందరు నెటిజన్లు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలు అందరికీ అందుబాటులోకి రావడంతో నిజానిజాలు తెలుసుకోకుండా సెలబ్రిటీల పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఇది సరికాదని అంటున్నారు.అలాగే ఈ విషయంపై కత్రినా కైఫ్ స్పందిస్తే కొంతమేర ఈ అసత్య ప్రచారాలకు బ్రేక్ పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కత్రినా కైఫ్ బాలీవుడ్లో సూర్య వంశి అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉంది.