బాలీవుడ్ ప్రేమ పక్షులు విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ లో ఇటీవలే డిసెంబర్ 9న మూడుముళ్ల బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే.గత కొంత కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట డిసెంబర్ 9న వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు.
ఇక వీరి పెళ్లి రాజస్థాన్ లోని ఒక హోటల్లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.వీరి పెళ్లికి ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు, బంధుమిత్రులు, సన్నిహితులు బాలీవుడ్ లో పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
అయితే పెళ్లి చాలా సింపుల్ గా చేసుకున్న ఈ జంట రిసెప్షన్ మాత్రం చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసారని తెలుస్తోంది.ఈ ఈవెంట్ కు బాలీవుడ్ లోనీ సెలబ్రిటీలు అందరినీ ఆహ్వానించినట్లు బాలీవుడ్ సినీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ జంట రిసెప్షన్ జెడబ్ల్యూ మారియట్ హోటల్లో డిసెంబర్ 20న జరగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఒకవైపు ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉండటంతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సూచించిన అన్ని రకాల ప్రోటో కాల్స్ ను వీరు పాటించబోతున్నారని తెలుస్తోంది.
కత్రినాకైఫ్ విక్కీ కౌశల్ సినిమా షూటింగ్లో పాల్గొనాల్సి ఉండటంతో, ఆ చిత్రీకరణలకు హాజరు కాకముందే పెళ్లి పనులు అన్నింటిని ముగించాలని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.అందువల్లే వారిద్దరూ ఆ తేదీని ఫిక్స్ చేసారని సమాచారం.బాలీవుడ్ సెలబ్రిటీలు అయిన సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్,షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్ లాంటి అగ్ర హీరోలకు ఇప్పటికే ఆహ్వానం అందింది.ప్రస్తుతం ముంబైలో ఒమిక్రాన్ వైరస్ విలయతాండవం చేస్తోంది.
దీనితో ఈ రిసెప్షన్ కు వచ్చే వారందరూ కూడా ఆర్టీపీసీఆర్ టెస్ట్ ను తప్పక చేయించుకోవాలి.అలాగే వారితో పాటు ఇటు రిపోర్ట్ ను కూడా తమ వెంట తీసుకురావాలి అని సన్నిహిత వ్యక్తి చెప్పినట్లు తెలుస్తోంది.