యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా షూటింగ్ ని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు.ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
అయితే షూటింగ్ మాత్రం ఆలస్యం అవుతూ వస్తుంది.అనుకున్న బడ్జెట్ కూడా దాటిపోయింది.
అయితే కథ మీద నమ్మకంతో యూవీ క్రియేషన్స్ వారు ఎక్కువ బడ్జెట్ పెడుతున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత ప్రభాస్ వరుసగా రెండు సినిమాలని సెట్స్ పైకి తీసుకొని వెళ్లబోతున్నాడు.
అందులో బాలీవుడ్ లో ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ సినిమాతో పాటు సలార్ కూడా.అయితే ముందుగా ఆది పురుష్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి మూడు నెలల్లో పూర్తి చేయాలని అనుకుంటున్నాడు.
ఈ సినిమా మొత్తం గ్రీన్ మ్యాట్ మీదనే జరగబోతుంది ఈ నేపధ్యంలో షూటింగ్ వేగంగా పూర్తయిపోయే అవకాశం ఉంది.ఈ సినిమా తర్వాత సలార్ పై ఫోకస్ పెడతాడు.
ఇక సలార్ సినిమా కోసం ప్రశాంత్ నీల్ బాలీవుడ్ హీరోయిన్లు పేర్లు పరిశీలిస్తున్నారు.ఇప్పటికే కృతి సనన్, దిశా పటానీ పేర్లు తెరపైకి వచ్చాయి.అయితే ఈ సారి మరో పేరు గట్టిగా వినిపిస్తుంది.స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ని హీరోయిన్ గా తీసుకోవాలని ప్రశాంత్ ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుస్తుంది.ఇప్పటికే ఆమెని సంప్రదించడం జరిగిందని టాక్.కత్రినా కైఫ్ అయితే యాక్షన్ ఎపిసోడ్స్ కి కూడా పెర్ఫెక్ట్ గా సరిపోతుంది కాబట్టి ఆమెని ప్రభాస్ కి బెస్ట్ పార్ట్నర్ అవుతుందని భావిస్తున్నారు.
త్వరలో ఆమెని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది.ఒక వేళ కత్రినా కైఫ్ ఈ సినిమాకి ఒకే చెబితే ఆమె చేయబోయే మూడో తెలుగు సినిమా ఇదే అవుతుంది.