బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న నటి కత్రినా కైఫ్.బ్రిటిష్ కంట్రీ నుంచి మోడలింగ్ కెరియర్ తో ఇండియాలో అడుగుపెట్టిన ఈ అమ్మడు ఆరంభంలో ఆమె నటనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.
పేస్ లో కనీసం హావభావాలు కూడా చూపించలేకపోతుంది అంటూ విమర్శకులు ఆమె గురించి వాఖ్యలు చేశారు.తెలుగులో మల్లీశ్వరి, అల్లరి పిడుగు సినిమాలో చేసింది.
బాలీవుడ్ లో ఆమె యాక్టింగ్ పై విమర్శలు వచ్చిన కూడా మెల్లగా తనని తాను మార్చుకుంది.నటన, డాన్స్ లో ఒక్కసారిగా ఊహించని మార్పుతో బాలీవుడ్ క్వీన్ గా మారిపోయింది.
స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది.ప్రస్తుతం కత్రినా కైఫ్ అందం, అభినయం, డాన్స్ కి బాలీవుడ్ లో కేరాఫ్ అడ్రెస్ అని చెప్పాలి.
అలాగే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ లలో ఒకరుగా కత్రినా ఉంది.ఈ అమ్మడు తన అందంతో అందరిని ఆకట్టుకోవడంతో పాటు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ కలిగి ఉంది.
తాజాగా ఆమె మరో అరుదైన గౌరవం పొందారు.గూగుల్ సంస్థ రూపొందించిన మోస్ట్ గూగుల్డ్ ఉమన్ జాబితాలో కట్రీనా ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానం దక్కించుకున్నారు.టాప్టెన్లో స్థానం దక్కించుకున్న ఏకైక బాలీవుడ్ నటిగా కత్రినా కైఫ్ నిలిచింది.ప్రస్తుతం అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీలో నటించేందుకు కట్రీనా సిద్ధమవుతున్నారు.
త్వరలోనే ఆ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుండడంతో యాక్షన్ సన్నివేశాల్లో నటించేందుకు కట్రీనా కఠినమైన శిక్షణ తీసుకుంటున్నారు.మొత్తానికి హాలీవుడ్ యాక్టర్స్ గా మారిన ప్రియాంకా చోప్రా, దీపికా పదుకునేని దాటుకొని ఎక్కువ మంది గూగుల్ లో సెర్చ్ చేసిన ఇండియన్ బ్యూటీగా కత్రినా నిలవడం నిజంగా విశేషం.