టాలీవుడ్లో వచ్చిన ‘మల్లీశ్వరి’ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కత్రినా కైఫ్, బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా మారి తన సత్తా చాటుతూ వస్తోంది.ఇప్పటికే స్టార్ హీరోల సరసన నటించిన కత్రినాకు బాలీవుడ్లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ వస్తుండటంతో కత్రినా ఎలాంటి సినిమాలో నటించినా అది ఖచ్చితంగా హిట్ అవుతుందని ప్రేక్షకులు భావిస్తుంటారు.
కాగా తాజాగా కత్రినా బాలీవుడ్లో తొలి లేడీ సూపర్ హీరో మూవీగా ‘సూపర్ సోల్జర్’ అనే సినిమాలో నటిస్తోంది.
ఈ సినిమాను అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కిస్తుండటంతో బాలీవుడ్ వర్గాల్లో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.కాగా ఈ సినిమా కోసం కత్రినా కైఫ్ ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్లో ట్రెయినింగ్ కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం ఆమె నటిస్తున్న ఫోన్ భూత్, టైగర్3 చిత్రాలు పూర్తయ్యాకే ‘సూపర్ సోల్జర్’ చిత్రంలో నటించాలని కత్రినా రెడీ అవుతోంది.ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుండటంతో ఈ సినిమాపై బాలీవుడ్ జనాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక కత్రినాకు జోడీగా ఈ సినిమాలో హీరో ఎవరూ లేరని, ఈ సినిమాలో ఆమే హీరోగా కనిపిస్తుందని చిత్ర యూనిట్ అంటోంది.కాగా ఈ సినిమాతో కత్రినా, అలీ అబ్బాస్ జాఫర్లు కలిసి మూడోసారి సినిమా చేస్తుండటంతో సూపర్ సోల్జర్ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాను 2021లో పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నాడు.మరి లేడీ హీరోగా మల్లీశ్వరి ఎలా అదరగొడుతుందో తెలియాలంటే ఈ సినిమా పూర్తయ్యి రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.