సౌత్ ఇండియాలో విభిన్న పాత్రలతో నటుడుగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంటూ దూసుకుపోతున్న కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి.ఇప్పటికే కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకడిగా ఉన్న విజయ్ సేతుపతికి అక్కడ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
అయినా కూడా మాతృభాషలోనే మాస్టర్ సినిమాతో విలనీగా నటించి మెప్పించాడు.అంతకంటే ముందుగా రజినీకాంత్ పేట సినిమాలో కూడా విజయ్ సేతుపతి విలన్ గా నటించాడు.
ఓ వైపు హీరోగా డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తూనే మరో వైపు విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సౌత్ లోని ఇతర బాషలలో సినిమాలు చేస్తున్నాడు.తెలుగులో సైరా సినిమాలో ఓ కీలక పాత్రలో మెరిసిన విజయ్ సేతుపతి తాజాగా ఉప్పెన సినిమాలో విలనీగా తన పెర్ఫార్మెన్స్ తో అందరి ప్రశంసలు అందుకున్నాడు.
ఇదిలా ఉంటే ఇప్పుడు బాలీవుడ్ లోకి కూడా విజయ్ సేతుపతి అడుగుపెట్టబోతున్నాడు.ఇప్పటికే అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో నటించడానికి ఒకే చెప్పాడు.అయితే డేట్స్ లేకపోవడంతో ఆ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.అయితే ఇప్పుడు స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తో కలిసి విజయ్ హిందీలో ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.
ఈ సినిమా కాస్తా ఆలస్యంగానే స్టార్ట్ అవుతుంది.అందాధున్ సినిమాతో చివరిగా హిట్ కొట్టిన థ్రిల్లర్ చిత్రాల సృష్టికర్త శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి విజయ్ సేతుపతి ఒకే చెప్పాడు.
ఈ మూవీ కూడా క్రైమ్ థ్రిల్లర్ గానే తెరకెక్కుతుంది.దీనికి మేరీ క్రిస్టమస్ అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు.
ఇందులో కత్రినా కైఫ్ కూడా కీలక పాత్రలో నటిస్తుంది.అయితే వీరిద్దరు హీరో, హీరోయిన్ గా చేస్తున్నారా లేదా వేర్వేరు పాత్రలలో కనిపిస్తారా అనేది వేచి చూడాలి.