బాలీవుడ్ జంట విక్కీ కౌశల్ కత్రినాకైఫ్ ఇటీవలే మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే.వీరిద్దరి పెళ్లి బాలీవుడ్ లో మంచి బజ్ ని క్రియేట్ చేసింది.
ఇక ఈ జంట పెళ్లి రాజస్థాన్ లోని సిక్స్ సెన్సెస్ పోర్ట్ లో అంగరంగ వైభవంగా జరిగింది.అయితే వీరి పెళ్లి అతి కొద్ది మంది సన్నిహితులు, స్నేహితులు ,సెలబ్రిటీల మధ్య మాత్రమే జరిగింది.
ఇకపోతే పెళ్లి సింపుల్ గా చేసుకున్న ఈ జంట రిసెప్షన్ మాత్రం చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.ఈ జంట రిసెప్షన్ డిసెంబర్ 20 న జరగనుంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
ఇక బాలీవుడ్ లోని సెలబ్రిటీలందరినీ ఈ రిసెప్షన్ వేడుకకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది.ఇప్పటికే పలువురు టాప్ సెలబ్రిటీలకు ఆహ్వానం కూడా అందినట్లు సమాచారం.
ఇక పెళ్లి అయ్యి కొద్ది రోజులు కూడా కాకముందే త్వరలోనే ఈ జంట కలిసి తెరపై సందడి చేయబోతున్నారు అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు కోడై కూస్తున్నాయి.ఈ జంట పూర్తి చేయాల్సిన సినిమాలు ఇంకా పెండింగ్ లో ఉండటంతో వివాహానికి సంబంధించిన పనులన్నీ పూర్తి చేసుకుని షూటింగ్ లకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది.
అంతేకాకుండా ఇప్పటికే కొన్ని కమర్షియల్స్ సినిమాలకు సంతకం చేసినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.లగ్జరి బ్రాండ్లకు చెందిన ఆరోగ్యకర ఉత్పత్తులకు ఈ జంట ప్రచారం చేయబోతున్నట్లు తెలుస్తోంది.ఈ యాడ్ లకు సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.కేవలం ఈ జంట మాత్రమే కాకుండా బాలీవుడ్ లోని పలువురు జంటలు పలురకాల కమర్షియల్ యాడ్స్ లో నటించిన విషయం తెలిసిందే.
కొత్తగా పెళ్లి అయిన ఈ జంట కూడా వారి బాటలోనే నడవబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.కత్రినాకైఫ్ విక్కీ కౌశల్ తమ పెళ్లికి సంబంధించిన వీడియో, టెలికాస్ట్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ కు భారీ ధరకు అమ్మేసినట్లు తెలుస్తోంది.
అందుకు అమెజాన్ ప్రైమ్ దాదాపుగా 80 కోట్లు చెల్లించి ఆ రైట్స్ ని దక్కించుకున్నట్లు సమాచారం.గత కొద్ది రోజులుగా ఈ జంట పేర్లు బాలీవుడ్ తో పాటు, సోషల్ మీడియాలో కూడా మార్మోగిపోతోంది.