మోస్ట్ బ్యూటిఫుల్ గ్లామర్ బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ గురించి అందరికీ తెలిసిందే.తన నటన తో ఎంతో మంది అభిమానుల హృదయాలను గెలుచుకుంది.
తను మోడలింగ్ లో సెలబ్రెటీ గా గుర్తింపు పొందింది.ఇక్కడి నుండే సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ గ్లామర్ బ్యూటీ.అంతేకాకుండా బాలీవుడ్ నటుల్లో ఎక్కువ పారితోషకం తీసుకుంటున్న నటుల్లో కత్రీనా కైఫ్ కూడా ఉంది.
2004లో విక్టరీ వెంకటేష్ సరసన “మల్లీశ్వరి” సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ.టాలీవుడ్ కంటే ముందు బాలీవుడ్ లో అడుగుపెట్టిన కత్రినాకు అంతగా గుర్తింపు రాలేక పోయేసరికి.మల్లీశ్వరి తర్వాత బాలీవుడ్ లో వరుస సినిమాలలో నటించి మంచి హిట్ ను సాధించుకుంది.
మొదట్లో తన నటన పట్ల విమర్శలు ఎదురైనా.అవన్నీ పట్టించుకోకుండా రాను రాను తనదైన శైలిలో మంచి గుర్తింపు సాధించుకుంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న కత్రినాకైఫ్.నాతో పెట్టుకోకు అంటూ హీరోని ఓడించింది.
గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో వస్తున్నా ‘ఫోన్ బూత్‘ సినిమా లో కత్రినా కైఫ్ హీరోయిన్ గా, సిద్ధాంత్ చతుర్వేది హీరోగా నటిస్తున్నారు.అంతేకాకుండా ఇషాన్ ఖట్టర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.కాగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఉదయపూర్ కోట లో జరుగుతుంది.ఈ క్రమంలో షూటింగ్ విరామ సమయంలో నటీనటులు సరదాగా బ్యాడ్మింటన్ ఆడగా.దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.ఈ విధంగా గా కత్రినాకైఫ్, సిద్ధాంత్ నువ్వా నేనా అన్నట్టు ఆటను ఆడగా సినీ బృందం మొత్తం వాళ్ల ఆటను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ విధంగా ఇందులో కత్రినా కైఫ్ గెలవగా.ఈ వీడియో ను కత్రినా తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
ఈ వీడియోని చూసి నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.