సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ను నేడు ఐమాక్స్ ముందు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కొట్టారట.ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెళ్లడిరచాడు.
పోలీసులకు ఫిర్యాదు ఇచ్చే విషయమై ఆలోచిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.తనపై దాడిని ఆయన తీవ్రంగా తప్పుబట్టాడు.
తన అభిప్రాయాలను మీడియాతో షేర్ చేసుకోవడం తప్పా అన్నాడు.ఇటీవల కత్తి మహేష్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ శ్రీరాముడు గురించి అసభ్యంగా మాట్లాడాడు.
శ్రీరాముడు స్త్రీ లోలుడు, ఆయన మాసాహారాన్ని ఎక్కువగా తింటాడు.జింక మాసం తినేందుకు బంగారు లేడిని చంపేందుకు ప్రయత్నించాడు అంటూ కత్తి మహేష్ నోటికి వచ్చినట్లుగా వాగేశాడు.
దాంతో అతడిపై చాలా కోపంగా ఉన్న కొందరు నేడు వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం ప్రీవ్యూకు వస్తాడని తెలిసి అక్కడ మాటు వేశారు.దొరికిన వెంటనే తన్ని పారిపోయారు.
కొట్టిన వారు మాస్క్ల్లో ఉన్న కారణంగా వారిని గుర్తించడం కష్టం అయ్యింది.కత్తి మహేష్ ఇకపై అయినా ఇలాంటి కామెంట్స్ మానుకుంటే మంచిది అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.