వివాదాస్పద సినీ విమర్శకుడు కత్తి మహేష్ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.నాంపల్లి కోర్టులో హాజరు పర్చగా కత్తి మహేష్కు 14 రోజుల రిమాండ్ను కోర్టు విధించింది.
కత్తి మహేష్ అరెస్ట్ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది.సోషల్ మీడియాలో కొన్ని రోజుల క్రితం ఆయన రాముడి గురించి చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగానే పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసినట్లుగా సమాచారం అందుతోంది.
రాముడిపై హిందువుల మనోభావాలు దెబ్బ తినేలా ఆయన వ్యాఖ్యలు చేశాడు.ఆ కారణంగానే ఇప్పుడు ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి ఉంటారంటూ ఆయన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేవారు చెబుతున్నారు.
ఒక సాదారణ మీడియా వ్యక్తిగా జనాలకు పరిచయం అయిన కత్తి మహేష్ కు బిగ్బాస్లో ఛాన్స్ రావడంతో అనూహ్యంగా పేరు దక్కించుకున్నాడు.ఆ తర్వాత పవన్ కళ్యాణ్పై విమర్శలు చేయడంతో మీడియాలో మరింతగా పాపులారిటీ దక్కించుకున్నాడు.
పవన్ కళ్యాణ్ పై ఆయన చేసినన్ని విమర్శలు రామ్ గోపాల్ వర్మ కూడా చేసి ఉండడు అనడంలో సందేహం లేదు.పవన్ ఏం పని చేసినా కూడా విమర్శించడంతో విమర్శకుడిగా కత్తి మహేష్ చాలా ఫేమస్ అయ్యాడు.
ఆ సమయంలోనే అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కత్తి మహేష్ను పోలీసులు నగర బహిష్కరణ చేయడం జరిగింది.ఏడాది పాటు నగరంకు దూరంగా ఉన్న కత్తి మహేష్ మళ్లీ హైదరాబాద్లో ఎంటర్ అయ్యి టీవీ షోలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.
ఇలాంటి సమయంలో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేయడం చర్చనీయాంశం అయ్యింది. కత్తి మహేష్పై పెట్టిన కేసు చాలా పెద్దదిగా న్యాయనిపుణులు చెబుతున్నారు.
మతాల మద్య విద్వేశాలు రెచ్చగొట్టేవిగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి.కనుక శిక్ష ఎక్కువ కాలం పడే అవకాశం ఉందంటున్నారు.