తెలుగు సినీ నటుడు, రాజకీయ నేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి అందరికీ తెలిసిందే.ఈయనకు అభిమానులు అంతా ఇంతా కాదు.
అంతేకాకుండా పవన్ కు శత్రువులు కూడా ఎక్కువగానే ఉన్నారు.ఆయనకు రాజకీయ పరంగా శత్రువుల నుండి విమర్శలు ఎదురవుతూనే ఉంటాయి.
ఆయన వ్యక్తిగత విషయాలను తవ్వుతూ సెటైర్లు వేస్తుంటారు.తాజాగా కత్తి మహేష్ పవన్ పై వేసిన సెటైర్ వైరల్ గా మారింది.
తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో బీజెపీ, జనసేన తో పొత్తు పై విమర్శలు ఎదురవుతున్నాయి.రెండు పార్టీల మధ్య సమావేశాలు జరుగక పోవడం వల్లే గ్యాప్ వచ్చిందని ఒప్పుకున్నాడు పవన్.
ఇదిలా ఉంటే వీళ్ళ నిర్ణయాలపై విమర్శలు బాగానే ఎదురవుతున్నాయి.ఇదిలా ఉంటే కత్తి మహేష్ చేసిన సెటైర్ మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.
పవన్ ని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు తన మాటలతో బూతులు తిడుతూ తెగ ట్రోల్ చేస్తుంటాడు కత్తి మహేష్.
ఇక తాజాగా తిరుపతి బై ఎలక్షన్ నేపథ్యంలో జనసేనాని సొంత పార్టీని అభ్యర్థిని ప్రకటించకుండా బీజెపీకి జై కొట్టడంతో కత్తి మహేష్ తెగ విమర్శలు చేశారు.తన ఫేస్ బుక్ ఖాతాలో పవన్ పై విమర్శలతో పోస్ట్ చేయగా.అందులో ‘ పాచిపోయిన లడ్డుల్ని పవిత్రమైన లడ్డులని వెంకన్న సాక్షిగా అబద్ధం చెప్పలేక.
తిరుపతిలో ప్రచారానికి రానన్న పవన్ కళ్యాణ్.గుర్రుగా సోము వీర్రాజు.వారిద్దరికీ అభినందనలు’ అంటూ పోస్ట్ చేయగా.దానితోపాటు బీజేపీ నేతలతో పవన్ దిగిన ఫోటో షేర్ చేశాడు.
‘పెళ్ళంటూ చేసుకున్నాక కలుపుకెళ్లే పని చూడాలి గానీ.ప్రతిరోజు కెలుకుడు యవ్వరాలేంది పవన్ కళ్యాణు? స్థానిక ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశానికి కన్ను కొడితివి.తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ రొమాన్స్ నడిపితివి.తిరుపతి సీటిచ్చి, ప్రచారం చేయ్యనంటే.ఫస్ట్ నైట్ మంచమెక్కిన పెళ్ళాంతో సంసారం చెయ్యను అన్నట్టే కదా! అన్యాయం కదా పవనూ!!’ అంటూ కత్తి మహేష్ సెటైర్ వేశాడు
.