టాలీవుడ్లో సినీ క్రిటిక్గా పలు వివాదాస్పద అంశాలను విశ్లేషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న కత్తి మహేష్, నిత్యం ఏదో ఓ వార్తతో హల్చల్ చేస్తుంటాడు.కాగా బిగ్బాస్లో పాల్గొనడంతో ఆయనకు మరింత గుర్తింపు లభించింది.
ఇక తాజాగా మరోసారి ఆయన వార్తల్లో నిలిచాడు.ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్, తెలుగు రాష్ట్రాల్లో తన పంజా విసురుతూ దూసుకుపోతోంది.
ఇప్పటికే పలువురు ప్రముఖులకు కూడా కరోనా పాజిటివ్ రావడంతో సినీ వర్గాల్లో ఆందోళన నెలకొంది.
అయితే తాజాగా కత్తి మహేష్ కూడా కరోనా వైరస్ బారిన పడినట్లు వార్తలు రావడంతో అందరూ అవాక్కయ్యారు.
ఇటీవల ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్కు కూడా కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.దీంతో టాలీవుడ్ వర్గాలు కరోనా వైరస్ దెబ్బకు భయాందోళనకు గురవుతున్నారు.అయితే కత్తి మహేష్కు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని, ఆయన ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నాడనే వార్త టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
దీంతో ఆయన తన ఆరోగ్యం పట్ల తాజాగా క్లారిటీ ఇచ్చాడు.
తనకు ఎలాంటి కరోనా వైరస్ సోకలేదని, ఎవరో కావాలనే తన పట్ల ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారని ఆయన మండిపడ్డాడు.ఈ వార్తలతో తన కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారని తెలిపాడు.
తాను కరోనా టెస్టు చేసుకోగా నెగెటివ్ రిపోర్టు వచ్చిందని, తాను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు.కాగా కత్తి మహేష్కు కరోనా పాజిటివ్ లేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.