టీచర్,విద్యార్థుల మధ్య సంబంధాలు ఎలా ఉండాలి అంటే ఒక మంచి స్నేహితులుగా ఉండాలి.వారిమధ్య స్నేహం,గౌరవం అనేది ఉంటె మాత్రం ఖచ్చితంగా ఆ విద్యార్థి మంచి వ్యక్తి గా సమాజంలో నిలబడతాడు.
అయితే విద్యార్థులకు ఆదర్శంగా నిలవాల్సిన టీచర్లు ఇప్పుడు మాత్రం వారిని చూస్తేనే భయానికి గురవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.కాశ్మీర్ లోని కుప్వారా జిల్లా లో ఒక టీచర్ ప్రవర్తన అందరినీ కూడా భయాందోళనకు గురిచేసింది.
ఒక టీచర్,స్తూడెంట్ మెడపై గొడ్డలి పెట్టి సరిగా ప్రవర్తించలేదంటే చంపేస్తానంటూ బెదిరించడం విశేషం.ప్రస్తుతం ఈ ఘటనకు సంబందించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ప్రస్తుతం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా అసలు అతను టీచరా లేదా రాక్షసుడా అన్నట్లు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.ఈ వీడియో పై జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముప్తి కూడా స్పందించారు.
ఈ వీడియో చూడడానికి చాలా చాలా క్రూరంగా ఉందని, ఆ సమయంలో ఆ విద్యార్థి ఎంత క్షోభ అనుభవించి ఉంటాడో అంటూ దీనికి కారణమైన వ్యక్తి పై వెంటనే చర్యలు తీసుకొని తగిన శిక్ష విధించాలి అని ఆమె డిమాండ్ చేశారు.
సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఆ వీడియో చూస్తే మాత్రం నిజంగా అతను ఒక టీచరేనా అన్న అనుమానం మాత్రం రాకమానదు.మరి దారుణంగా ఆ విద్యార్థి మెడ పై గొడ్డలి పెట్టి బెదిరించడం చూసిన నెటిజన్లు భయాందోళనకు గురయ్యారు.నిజంగా టీచర్స్ ఇలా కూడా ప్రవర్తిస్తారా అన్న అనుమానం కలగక మానదు.
మరోపక్క ఈ వీడియో పై కాశ్మీర్ పోలీసులు కూడా స్పందించి ఆ చిన్నారిని గొడ్డలితో బెదిరించిన వ్యక్తిపై కేసు రిజిస్టర్ చేశామని తెలిపారు.