లోకేష్ కనగరాజ్, కార్తి కాంబినేషన్ లో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఖైది సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.ఒక రోజు జరిగిన కథతో ఈ మూవీని దర్శకుడు తెరపై యాక్షన్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఆవిష్కరించారు.
ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.కార్తి కెరియర్ లో బెస్ట్ మూవీలలో ఒకటిగా ఇది నిలిచిపోతుందని ప్రశంసలు లభించాయి.
ఇక అతని కల్ట్ పెర్ఫార్మెన్స్ కి ప్రేక్షకుల నుంచి విజిల్స్ పడ్డాయి.పోలీసుల ప్రాణాలు రక్షించే ఖైది పాత్రలో అతని పాత్ర ఆద్యంతం ఆకట్టుకుంది.
ఇక ఈ మూవీ క్లైమాక్స్ లోనే సీక్వెల్ ఉంటుందనే విషయాన్ని దర్శకుడు రివీల్ చేశాడు.ఈ సీక్వెల్ లో కార్తి ఖైదిగా ఎందుకు మారాల్సి వచ్చింది.
అతని లైఫ్ ఏంటి అనే విషయాలని దర్శకుడు తెరపై ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఖైది తర్వాత లోకేష్ విజయ్ తో మాస్టర్ సినిమా చేసి సూపర్ హిట్ కొట్టాడు.
ఇప్పుడు కమల్ హసన్ తో విక్రమ్ అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కిస్తున్నారు.ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.ఇదిలా ఉంటే ఈ మూవీ తర్వాత లోకేష్ కనగరాజ్ ఖైది సీక్వెల్ పై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తుంది.ఖైది మూవీతో పాటు రీసెంట్ గ కార్తితో సుల్తాన్ మూవీని నిర్మించిన ఎస్.ఎస్.ప్రభు ఈ విషయాన్ని దృవీకరించారు.కార్తి, లోకేష్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిన వెంటనే ఖైది సీక్వెల్ ఉంటుందని స్పష్టం చేశాడు.