ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షించిన యువ హీరో కార్తికేయ.ఈ సినిమా తర్వాత అదిరిపోయే క్రేజీ సొంతం చేసుకున్న కార్తికేయ వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు ఇతర హీరోల సినిమాలలో విలన్ గా కూడా నటిస్తున్నాడు.ఇప్పటికే నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ గా మెప్పించిన కార్తికేయ ప్రస్తుతం అజిత్ హీరోగా తెరకెక్కుతున్న వాలిమై సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.
ఇందులో పవర్ ఫుల్ విలన్ గా సౌత్ ప్రేక్షకులని అలరించడానికి కార్తికేయ రెడీ అయిపోయాడు.మరోవైపు గీతా ఆర్ట్స్ 2లో లావణ్య త్రిపాఠికి జోడీగా చావు కబురు చల్లగా అనే సినిమా చేశాడు.
ఈ సినిమా త్వరలో రిలీజ్ కి రెడీ అవుతుంది.ఇప్పటికే సినిమా మీద మంచి బజ్ క్రియేట్ అయ్యింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు కార్తికేయ క్రేజీ ఆఫర్స్ ని సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.
బాలీవుడ్ బడా నిర్మాత బోనీ కపూర్ వాలిమై సినిమాని నిర్మిస్తున్నాడు.
ఈ సినిమాలో కార్తికేయ విలనీ పెర్ఫార్మెన్స్ కి బోనీ కపూర్ కనెక్ట్ అవ్వడంతో అతనితో రెండు సినిమాలు చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తుంది.వీటి కోసం అడ్వాన్స్ కూడా ఇచ్చాడని టాక్ నడుస్తుంది.
త్వరలో బోనీ కపూర్ ప్రొడక్షన్ లో తెరకెక్కబోయే హింది సినిమాలలో అతనిని విలన్ గా తీసుకోవడానికి అతనితో ఈ ఒప్పందం చేసుకున్నాడని తెలుస్తుంది.అయితే ఈ వార్తలు ఎంత వరకు నిజమనేది తెలియాలంటే కార్తికేయ స్పందించే వరకు వేచి చూడాల్సిందే.