కార్తీకదీపం అనే ఈ సీరియల్ ఎప్పుడెప్పుడు ముగుస్తుందా అని ఎదురు చూసే ప్రేక్షకులకు మొత్తానికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి.ఎందుకంటే ఈ సీరియల్ ముగింపు పలకడానికి దగ్గరలో ఉంది.
చాలామంది ఈ సీరియల్ కథను చూడలేక విసుకు చెందారు.మొదటి నుంచి ఒకటే కథతో కొనసాగుతుండటంతో దీంతో ప్రేక్షకులు ఆ ఒకటే కథను చూడటానికి ఆసక్తి చూపించలేకపోయారు.
అలా ఈ సీరియల్ ఎప్పుడెప్పుడు ముగుస్తుందా అని ఎదురు చూశారు.మొత్తానికి ఈ సీరియల్ శుభం కార్డు పలకడానికి దగ్గరలో ఉంది.
ఈ సీరియల్ మొదటి నుంచి సాగిన కథ ఏంటంటే.కార్తీక్ దీపను ఇష్టపడి పెళ్లి చేసుకోగా ఆ తర్వాత ఇద్దరూ హనీమూన్ కి వెళ్లగా అక్కడనుంచి మొదలయ్యింది పురాణం.
అప్పటికే కార్తీక్ ని ఇష్టపడ్డ మోనిత కార్తీక్ ని దక్కించుకోవడం కోసం ప్రయత్నించగా కార్తీక్ దీప ను పెళ్లి చేసుకోవడంతో మోనిత వారిని విడదీయటానికి కంకణం కట్టుకుంది.పెళ్లికి ముందే కార్తీక్ హిమ అనే అమ్మాయిని ఇష్టపడగా ఆమెను కూడా చంపేసింది మోనిత.
ఇక దీపను కూడా అలాగే కార్తీక్ నుంచి దూరం చేయాలి అని అప్పటినుంచి ఇప్పటివరకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది.దీప ప్రెగ్నెంట్ అవ్వగా అదంతా వేరొకరి ద్వారా గర్భం వచ్చింది అన్నట్లుగా క్రియేట్ చేసి కార్తీక్ కు దీపపై అనుమానం పెంచేలా చేసింది మోనిత.
అలా కొంతకాలం కథ అలాగే సాగింది.ఆ తర్వాత కార్తీక్ కు దీప గురించి నిజం మొత్తం తెలియటంతో అప్పుడు దీప ని దగ్గరికి తీసుకున్నాడు కార్తీక్.
అలా కార్తీక్ తన భార్య పిల్లలతో సంతోషంగా ఉన్నప్పటికీ కూడా మోనిత మాత్రం కార్తీక్ ను అస్సలు వదల లేకపోయింది.ఆ తర్వాత కార్తీక్ సాంపుల్స్ ద్వారా మోనిత ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది.
అలా కథ మళ్లీ అడ్డం తిరిగింది.మధ్య మధ్యలో డైరెక్టర్ ఎన్నో ట్విస్టులు తీసుకొచ్చాడు.
ఏకంగా యాక్సిడెంట్లో కార్తీక్, దీప లను చంపేసి పిల్లలను పెద్దవాళ్ళగా చూపించాడు.
కానీ ఆ కథ ప్రేక్షకులకు అంతగా నచ్చకపోవటంతో చనిపోయిన వాళ్లను బతికించాడు డైరెక్టర్.ఇక బతికాక కూడా చాలా ట్విస్టులు అందించాడు.ఇకనైనా సంతోషంగా ఉంటారా అనుకుంటే అప్పుడు కూడా మోనిత ద్వారా కథను సాగదీశాడు డైరెక్టర్.
దీంతో అదే కథను చూసి ప్రేక్షకులు ఇదంతా ఇలాగే సాగుతుంది అని చూడటానికి కూడా ఆసక్తి చూపించలేకపోయారు.ఇప్పటికీ కథ అలాగే నడుస్తుండగా రేటింగు కూడా పూర్తిగా తగ్గిపోయింది.
దీంతో డైరెక్టర్ చేసేది ఏమీ లేక కథకు శుభం కార్డు పలకాలని చూస్తున్నాడు.ప్రస్తుతం కథలో దీప త్వరలో చనిపోతున్నట్లు చూపించగా మోనిత మాత్రం కార్తీక్ తో పెళ్లికి సిద్ధమైనట్లుగా చూపిస్తున్నాడు.చివరికి ఏం జరుగుతుందో తెలియదు కానీ.కథను మాత్రం పూర్తి చేయాలన్నట్లుగా క్లారిటీకి వచ్చాడు డైరెక్టర్.స్టార్ మా కూడా తాజాగా ఇంస్టాగ్రామ్ అకౌంట్లో ఈ సీరియల్ కి సంబంధించిన ఒక వీడియో కూడా విడుదల చేశారు.అందులో కార్తీక్, దీప వచ్చే కొత్త సీరియల్ గురించి అనౌన్స్ ఈ సీరియల్ ముగిస్తుంది అని చెప్పుకొచ్చారు.
దాంతో ఆ వీడియో చూసిన వాళ్లంతా హమ్మయ్య కార్తీకదీపం అయిపోయింది అంటూ.ఒక పీడ విరగడయింది అంటూ కామెంట్లు పెట్టగా మరి కొంతమంది కథను మార్చి కొన్ని రోజులు సాగదీస్తే బాగుండు అని అంటున్నారు.