తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ కార్తిక నాయర్( Karthika nair ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె ఒకప్పటి సీనియర్ హీరోయిన్ నటి రాధ( Radha ) కూతురు అన్న విషయం మనందరికీ తెలిసిందే.
అక్కినేని నాగచైతన్య నటించిన జోష్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చిరుగా నటించిన దమ్ము సినిమాలో నటించిన విషయం తెలిసిందే.
దమ్ము సినిమాతో భారీగా పాపులారిటీని ఏర్పరచుకుంది కార్తిక నాయర్.కాగా ఈమె తెలుగులో తమిళ, మలయాళ భాషల్లో నటించినప్పటికీ 10కి పైగా సినిమాలలో కూడా నటించలేకపోయింది.
అయితే ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు రాకపోవడంతో సినిమాలకు గుడ్ బై చెప్పి బిజినెస్ వైపు అడుగులు వేసింది.ఇది ఇలా ఉంటే తాజాగా కార్తిక నాయర్కు యుఎఈ ప్రభుత్వం నుంచి గోల్డెన్ వీసా అందిందిఉదయ్ సముద్ర గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, కొన్ని సంవత్సరాలుగా వ్యాపార కార్యకలాపాలను అభివృద్థి చేయడంలో విశేషమైన పాత్ర పోషించారు కార్తిక నాయర్.గత కొన్నేళ్లగా అక్కడే స్థిరపడి, యంగ్ ఎంట్రప్రెన్యూవర్గా గుర్తింపు పొందిన కార్తిక నాయర్ కు గోల్డెన్ వీసా అందజేశారు.దుబాయ్ లోని టూఫోర్ 54 ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో యుఎఇకి చెందినహమద్ అల్మన్సూరి( Hamad Almansoori ) కార్తికకు గోల్డెన్ వీసాను అందజేశారు.
ఈ సందర్భంగా కార్తీక ఆనందం వ్యక్తం చేశారు.యువ మహిళా పారిశ్రామికవేత్తగా స్వాగతం పలికినందుకు యుఎఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు.ఈ గుర్తింపు పొందడం చాలా ఆనందంగా ఉంది అని తెలిపింది కార్తీక నాయర్.ఇకపోతే కార్తిక నాయర్ తల్లి ఒకప్పటి సీనియర్ నటి రాధ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.1980ల్లో ఆమె స్టార్ హీరోయిన్గా రాణించారు.తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్టార్ హీరోల సరసన ఆమె నటించి మెప్పించింది.
కాగా రాధ ప్రస్తుతం బుల్లితెర పై ప్రసారం అవుతున్న బీబీ జోడీ షోకీ జెడ్జ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.