స్టార్ మా లో ప్రసారం అవుతున్న కార్తీక దీపం సీరియల్ గురించి తెలియని వారెవ్వరు లేరు.సినిమాలకంటే ఎక్కువ సీరియల్ కి ఎక్కువ ప్రాధాన్యం ఉండగా అందులో ఈ కార్తీకదీపం సీరియల్ మాత్రం మరింత ముఖ్యమైన సీరియల్ గా మారింది.
ఇక ఈ సీరియల్ సమయం మొదలు కాక ముందుకే టీవీల ముందు వచ్చి వాలిపోతుంటారు ప్రేక్షకులు.
ఇక ఈ సీరియల్ కథ గురించి అందరికీ తెలిసిందే.
ఇక ఇందులో దీప, కార్తీక్ లు ఎప్పుడు కలుస్తారా.అని ప్రేక్షకులు ఎదురు చూస్తుంటే.
మోనిత మాత్రం వీరిద్దరు ఎప్పుడు విడిపోతారా అని ఎదురు చూస్తుంది.ఇక ఈ సీరియల్ ఈ రోజు కి 979 వ ఎపిసోడ్ కు ఎంట్రీ కాగా ఇందులో డాక్టర్ బాబు మోనిత ఇంటికి వెళ్లనున్నాడు బహుశా నిజం తెలిసిపోయింది ఏమో.
డాక్టర్ బాబు తండ్రి అనారోగ్యం వల్ల తమ హాస్పిటల్ లోనే చేరి ట్రీట్మెంట్ తీసుకొన్న తర్వాత అక్కడ వారి మధ్య కొన్ని సంభాషణ వాదనలు జరుగుతాయి.ఆ తర్వాత కార్తీక్ తప్ప మిగతా వాళ్ళు ఇంటికి వస్తారు.ఇక దీపం తన ఇంట్లో దేవుడు ముందు నిల్చొని తన బాధలను చెప్పుకుంటూ తన పిల్లలతో మాట్లాడి భావోద్వేగానికి గురి అవుతుంది.
ఇక కార్తీక్ మోనిత ఇంటికి వెళ్తాడు.
అక్కడ కార్తీక్ తో మోనిత కాస్త వెటకారంతో మాట్లాడగా కార్తీక్ విరుచుకుపడుతూ అక్కడనుంచి వెళ్ళి పోతాడు.ఇక ఆనందరావు, సౌందర్య దీప గురించి మాట్లాడుతూ ఆమె ఫోన్ ఏం లిఫ్ట్ చేయకపోతే సరికి ఆనందరావు సౌందర్యను దీప ఇంటికి పంపిస్తాడు.
ఇక కార్తీక్ కార్ లో వస్తూ ఉండగా ఎదురుగా అంజి బైక్ మీద కనబడతాడు.ఇక కార్తీక తనను ఆపి తన కారులో మౌనిత ఇంటికి తీసుకెళ్తాడు.
ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.