స్టార్ మా లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి తెలియని వారవ్వరూ ఉండరు.ఇందులో కార్తిక్, దీప గురించి, వారి మధ్య జరుగుతున్న గొడవ గురించి, వాళ్ల కుటుంబం గురించి తెలిసిన విషయమే.
ఇక ఈ సీరియల్ మొదటి నుంచి జరుగుతున్న కథనే ఇప్పటికీ కొనసాగుతోంది.ఇదిలా ఉంటే తాజాగా దీప ఘోరమైన అవమానం జరగగా.
అమ్మ, నాన్న ఎవరు కావాలంటూ పిల్లలకు ఛాయిస్ ఇచ్చింది.
ఈరోజుకి కార్తీకదీపం 977 వ ఎపిసోడ్ కు అడుగు పెట్టింది.
ఇక కార్తీక్ తన కుటుంబ సభ్యులతో నేను మారను నేను చూసింది.తెలుసుకున్నది సత్యం అంటు తెగేసి చెబుతాడు.
ఇక నేను మారడం కోసం ఎన్ని సాక్షాలు తెచ్చిన అనవసరం అంటూ చెప్పేస్తాడు.వెంటనే దీప.
మంచిది నేను నా వ్యక్తిత్వాన్ని అంగటి లో సరుకులా అమ్మలేను.అమ్మని నేను.
అమ్మకానికి పనికిరాని వస్తువును కాను అంటూ అయిపోయింది అత్తయ్యా మనకు దొరికిన చిరుదీపం కూడా కొడిగంటుకపోయింది.నమ్మరు, మారరు, అర్థం చేసుకోరు అక్కర్లేదు నేను అక్కర్లేదు నువ్వు పిల్లలు అక్కర్లేదు అంటూ వాళ్ల భవిష్యత్లో అవసరం లేదు.
పదేళ్ల తపస్సుకు ఓ ముగింపు దొరికింది అని మీరు అనుకుంటున్నారు.కానీ ఇది కూడా కల్పితమేనా అని ఆయన అనుకుంటున్నారు.
ఇంకేం చెప్పాలి అంటూ భావోద్వేగానికి గురి అవుతుంది.
వెంటనే కార్తీక్ ఇంకేం చెప్పద్దు అంటూ మరింతగా అవమానంతో ఆ విహారి ఎటువంటి వాడైనా కానీ నీ మీ పవిత్రతను రుజువు చేసుకోవడానికి అతడి కాపురాన్ని కూడా బజార్లో పెట్టిన దిగజారిపోయిన నెరజానవే నువ్వు.నిన్ను ఎలా నమ్ముతాను అంటూ కార్తీక్ కోపం అవ్వగా.వెంటనే సౌందర్య కోపంతో కార్తీక్ను కొట్టబోతే దీపా వచ్చి ఆపుతుంది.
దీంతో దీప నేను బయట దానిని నావల్ల ఎదిగిన కొడుకుని కొడితే మాత్రం కోడలి పవిత్రత రుజువు అవుతుందా ఇక నా బతుకు ఇంతే.ఎప్పటికీ ఇంతే అంటూ కన్నీరు పెట్టుకుంటుంది.
ఇలా ఇదంతా జరుగుతున్న సమయంలో అక్కడికి వచ్చిన తన ఇద్దరు పిల్లలని మీకు అమ్మ.నాన్న ఎవరో ఒకరే మిగిలారు.ఎవరు కావాలో మీరే తేల్చుకోండి.అమ్మ కావాలంటే నా దగ్గరకు రండి.
నాన్న కావాలంటే ఇక్కడే ఉండండి అని పిల్లలకు ఛాయిస్ వదిలేస్తుంది.ఇక పిల్లలు ఏడుస్తూ దీపను హత్తుకోగా.
అక్కడి నుంచి తన ఇంటికి వెళ్లాలని బయటకు వస్తున్న సమయంలో ఎవరు ఆపినా వినకుండా తన గతాన్ని గుర్తు చేసుకుంటూ తన ఇంటికి చేరుతుంది.ఇక అందులో శౌర్య ఇంటికి వచ్చాక నాన్న కావాలంటూ మారం చేస్తూ.
కొన్ని విషయాలు తెలుపుతూ నాన్న లేకుండా ఎలా ఉండాలని దీపను ప్రశ్నిస్తుంది.ఇక ఇలా జరుగగా తర్వాత ఎపిసోడ్ లో ఏమవుతుందో చూడాలి.