వెండితెరపై ఓ స్టార్ హీరో సినిమాకి ఉన్నంత క్రేజ్ బుల్లితెరపై కార్తీకదీపం సీరియల్ కు మరింత రెట్టింపుతో ఉంది.సామాన్యులే కాదు సెలబ్రెటీలు కూడా ఈ సీరియల్ కు బాగా అలవాటు పడ్డారు.
ఇప్పటి వరకు బుల్లితెరలో ఏ సీరియల్ కూడా సొంతం చేసుకొని ఫాలోయింగ్ ను ఈ కార్తీకదీపం సీరియల్ సొంతం చేసుకుంది.నిజానికి ఈ సీరియల్ ప్రారంభం నుండి ఒకటే కథతో సాగుతుంది.
అది కూడా కొన్ని ట్విస్ట్ లతో బాగానే నడిపిస్తున్నాడు డైరెక్టర్ కాపుగంటి రాజేంద్ర.
నిజానికి ఏ సీరియల్ నైనా ఒకే కథ సాగడంతో బోర్ కొడుతుందన్న ఉద్దేశంలో ఉన్న పాత్రలను పెద్ద వాళ్ళుగా మారుస్తూ సరికొత్త కథలు క్రియేట్ చేస్తుంటారు దర్శకులు.
కానీ మన కార్తీకదీపం డైరెక్టర్ మాత్రం అలా కాదు బిజినెస్ పరంగా ట్విస్ట్ లతో సాగిస్తున్నాడు.నిజానికి ఇంత ఫాలోయింగ్ సంపాదించుకున్న కార్తీకదీపం శుభం కార్డు పలుకుతే మాత్రం బుల్లితెర అభిమానులకు నిరాశనే కలుగుతుంది.
కానీ ప్రస్తుతం సాగుతున్న మోనిత ప్రెగ్నెంట్ విషయం పట్ల బాగా మండిపడుతున్నారు అభిమానులు.
ఇకనైనా దీప, కార్తీక్ లు కలుస్తారా.
మళ్లీ ఇంకెన్ని ఎపిసోడ్ లతో నడిపిస్తారో.అని మండిపడుతున్నారు అభిమానులు.
ఇప్పటికే కథ మొత్తం ట్విస్ట్ లతో సాగుతున్న తరుణంలో మళ్లీ కార్తీకదీపం 2 అంటూ షాకిచ్చాడు డైరెక్టర్.దీంతో అభిమానులు ఓ రేంజ్ లో మండిపడుతున్నారు.
గతంలో డైరెక్టర్ రాజేంద్ర చిన్నపిల్లలను పెద్దవాళ్లుగా చూపించే పాత్రలలో చేయడం కుదరదని ఉన్న పాత్రలతోనే సాగదీస్తామని క్లారిటీ ఇచ్చాడు.
ఇక తాజాగా పార్ట్-2 ఉంటుందని కొత్త పాత్రల ఆలోచన లేదని తెలిపాడు.ఇది బిజినెస్ కాబట్టి రేటింగ్ ఉన్నంతవరకు ఈ స్టోరీను ఇలాగే నడిపించాలని అనుకుంటున్నారట.అంతే కానీ మార్పులు ఉండవని ఒకవేళ బోర్ కొడుతునప్పుడు ఎటువంటి ట్విస్ట్ పెట్టాలని ఆలోచిస్తూనే ఉంటామని తెలిపాడు.
దీంతో ఈ మాట విన్న కార్తీకదీపం అభిమానులు.ఇప్పటికే కథ పరిస్థితి ఏంటని అనుకుంటే మళ్లీ కొత్త ట్విస్ట్ ఇస్తున్నాడు ఏంటి అని కామెంట్స్ చేస్తున్నారు.
మరో నెటిజన్.ముందు ఈ సీరియల్ ని పూర్తి చేయి.లేదంటే నీ మీద కేసు పెడతా.పార్ట్-2 తీశావంటే నిన్ను చంపేసి జైలుకి వెళ్తా ఇది జోక్ కాదు అంటూ ఓ రేంజ్ లో మండి పోయాడు.అంతేకాకుండా ఇంకా ఎన్నో కామెంట్స్ ఎదుర్కొంటున్నాడు డైరెక్టర్ రాజేంద్ర.