బుల్లితెర శోభన్ బాబుగా బుల్లితెరపై ఎంతో మంచి ప్రేక్షకాదరణ దక్కించుకున్న కార్తీకదీపం సీరియల్ హీరో డాక్టర్ బాబు (పరిటాల నిరుపమ్) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న డాక్టర్ బాబు తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు.
ఈ క్రమంలోనే ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి జిహెచ్ఎంసి పార్కులో డాక్టర్ బాబు మొక్కలను నాటారు.
ఈ క్రమంలోనే ఈ చాలెంజ్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ సందర్భంగా డాక్టర్ బాబు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అతని పై ప్రశంసలు కురిపించారు.అదే విధంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనకు మొక్కలు ఎంతో అవసరమని ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని పరిటాల తెలియజేశారు.
ఇక తనవంతుగా ఈరోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటానని తెలిపిన డాక్టర్ బాబు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఇతర సీరియల్ నటులు అనుదీప్ చౌదరి, ప్రీతమ్, మానస ఈ ముగ్గురికి డాక్టర్ బాబు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు.ప్రస్తుతం డాక్టర్ బాబుకు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం ఈయన కార్తీకదీపం, హిట్లర్ సీరియల్స్ ద్వారా బిజీగా ఉండటమే కాకుండా మరో వైపు తన భార్యతో కలిసి యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిందే.