నందమూరి బాలకృష్ణ అఖండ తర్వాత గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తుందని తెలుస్తుంది.ఇదిలాఉంటే లేటెస్ట్ గా సినిమాలో సీరియల్ స్టార్ హీరోయిన్ నటిస్తుందని టాక్ వచ్చింది.
బుల్లితెర ఆడియెన్స్ కి కార్తీక దీపం సీరియల్ అంటే తెలియని వారుండరు.అందులో దీప పాత్ర చేసిన ప్రేమి విశ్వనాథ్ కి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
స్టార్ మా లో అత్యధిక రేటింగ్ తెచ్చుకునే ఈ షో వల్ల ప్రేమి విశ్వనాథ్ కి మంచి క్రేజ్ ఏర్పడింది.ఆ క్రేజ్ తోనే ఇప్పుడు ఆమెకి బాలకృష్ణ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిందని తెలుస్తుంది.
సినిమాలో దీప అలియాస్ ప్రేమి విశ్వనాథ్ కి మంచి పాత్ర దొరికిందని అంటున్నారు.సినిమా ద్వారా ఆమె సిల్వర్ స్క్రీన్ ఆడియెన్స్ ని కూడా అలరిస్తుందని చెప్పొచ్చు.
అఖండ హిట్ తో జోష్ లో ఉన్న బాలయ్య బాబు గోపీచంద్ సినిమాతో కూడా ఆ హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నాడు.