తమిళ హీరో కార్తీ ఇటీవల ఖైదీ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే హిట్ అందుకున్నాడు.కేవలం కంటెంట్తో సినిమాను సూపర్ హిట్ చేయవచ్చని కార్తీ మరోసారి ప్రూవ్ చేశాడు.
ఇక కార్తీ ఎంతకాలంగానో ఎదురుచూస్తోన్న భారీ సక్సెస్ ఖైదీ రూపంలో దక్కడంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఇదే జోష్లో తన నెక్ట్స్ మూవీని కూడా లైన్లో పెట్టేశాడు ఈ హీరో.
కార్తీ, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న తన తాజా చిత్రానికి ‘దొంగ’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ను ఫిక్స్ చేశాడు కార్తీ.ఖైదీ నుండి దొంగగా మారిన కార్తీ, తన సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశాడు.
ఈ సినిమా యాక్షన్తో పాటు కంటెంట్ను సమపాలల్లో కలిగి ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
తన వదిన జ్యోతికతో ఓ కీలక పాత్ర చేయిస్తోన్న కార్తీ, ఈ సినిమాలో సత్యరాజ్తో మరో కీలక పాత్ర చేయిస్తున్నాడు.జీతు జోసెఫ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు కార్తీ రెడీ అవుతున్నాడు.ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను అతిత్వరలో రిలీజ్ చేస్తున్నట్లు కార్తీ తెలిపాడు.
మరి ఈ సినిమాలో పోలీస్ ఎవరు, దొంగ ఎవరు అనే అంశాన్ని మాత్రం గోప్యంగా ఉంచారు చిత్ర యూనిట్.