తమిళ హీరో కార్తీ ఇటీవల నటించిన ఖైదీ సినిమా తెలుగులో సూపర్ హిట్గా నిలిచింది.ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసే వరకు కూడా హౌజ్ఫుల్ షోలతో నడిచిందంటే సినిమా కంటెంట్ ప్రేక్షకులకు ఎంతమేర నచ్చిందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.
కానీ ఈ సినిమా సక్సెస్ హీరో కార్తీకి ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది.
ఖైదీ సినిమా తరువాత కార్తీ నటించిన తాజా చిత్రం దొంగ.
పూర్తి క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమాలో జ్యోతిక కూడా కీలకపాత్ర పోషిస్తోంది.ఈ సినిమాను డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వదులుతున్నారు చిత్ర యూనిట్.
అయితే ఈ సినిమాకు చాలా దారుణమైన బజ్ ఉండటంతో ఈ సినిమా రిలీజ్ అవుతున్న విషయం కూడా చాలా మందికి తెలియదు.దొంగ అనే సినిమా రేపు వస్తున్నట్లు కూడా తెలుగు జనాలకు తెలియదంటే ఈ సినిమా ప్రమోషన్స్ ఏస్థాయిలో జరిగాయో అర్ధం అవుతోంది.
జీతు జోసెఫ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా ప్రతిరోజూ పండగే, రూలర్ సినిమాలు ఇచ్చే పోటీని ఎంతవరకు తట్టుకుంటుందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.అయితే దొంగ చిత్రాన్ని రిలీజ్ చేసే సమయం ఇది మాత్రం కాదని అంటున్నారు పలువురు సినీ విశ్లేషకులు.