టాలీవుడ్లో చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్లను మెగా బ్రదర్స్ అంటారు.ఇక కోలీవుడ్లో సూర్య మరియు కార్తీలను మెగా బ్రదర్స్ అంటారు.
ఇప్పుడు ఈ వార్త తమిళ మెగా బ్రదర్స్ గురించి.ప్రస్తుతం సూర్య ‘24’ సినిమాలో నటిస్తున్నాడు.
సమంత హీరోయిన్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సూర్య తన సొంత నిర్మాణ సంస్థ అయిన 2డి ఎంటర్టైన్స్మెట్స్లో నిర్మిస్తున్నాడు.ఈయన గతంలో కూడా జ్యోతిక ముఖ్య పాత్రలో నటించిన ఒక సినిమాను ఈ నిర్మాణ సంస్థలో సూర్య నిర్మించాడు.
కాని భారీ బడ్జెట్తో మొదటి సారి సూర్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.ఇక అన్న దారిలోనే మెగా బ్రదర్ కార్తీ కూడా నిర్మాణ సంస్థను ప్రారంభించాడు.
తమిళంతో పాటు తెలుగులో కూడా సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకు పోతున్న కార్తి ప్రస్తుతం ‘కాష్మోర’ సినిమాలో నటిస్తున్నాడు.భారీ బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఇక ఈ సినిమాను కార్తీ ప్రిన్స్ ప్రొడక్షన్ పేరుతో నిర్మిస్తున్నాడు.గతంలో ఈ అన్నదమ్ములు ఇద్దరు కూడా జ్ఞానవేల్ రాజా నిర్మాణంలో ఎక్కువ సినిమాలు నటించారు.
వీరి సినిమాలు అనగానే గ్రీన్ స్టూడియో బ్యానర్ గుర్తుకు వచ్చేది.కాని ఇప్పుడు వీరిద్దరు కూడా విడి విడిగా బ్యానర్లు ప్రారంభించడం ప్రస్తుతం తమిళ సినీ వర్గాల్లో గుసగుసలకు తావిస్తోంది.