చైనా, అమెరికా సహా పలు దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను భయపెడుతోంది.ఇప్పటికే వందల సంఖ్యలో కరోనా వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు.
కొన్ని వేల మంది ఈ వైరస్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు.ముఖ్యంగా చైనాలో కరోనా వైరస్ కారణంగా అయిదు నగరాలను పూర్తిగా బహిష్కరించారు.
వారితో ఎలాంటి సంబంధాలు లేకుండా చేశారు.రోడ్డు రైలు, వాయి ఇలా అన్ని మార్గాలను ఆ నగరాలకు బంద్ చేశారు.
అంతగా భయపెడుతున్న కరోనా వైరస్ ప్రస్తుతం ఒక కంపెనీని నట్టెటా ముంచింది.కరోనా పేరుతో ఉన్న బీర్ కంపెనీకి సంబంధించిన బీర్లను తాగేందుకు కొనుగోలు చేసేందుకు ఏ ఒక్కరు ఆసక్తి చూపడం లేదు.
ప్రతి ఒక్కరు కూడా కరోనా అంటే భయపడుతున్నారు.అందుకే ఆ కంపెనీ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంబంధిత ఇబ్బందులను ఎదుర్కొంటుందట.ఆ కంపెనీ కి కరోనా వైరస్ కు సంబందం లేకున్నా కూడా ఇప్పుడు బీర్ లను తాగేందుకు ఎవరు ముందుకు రావడం లేదు.