బాలీవుడ్ దర్శకులు చేసే హిస్టోరికల్ మూవీలకి మహారాష్ట్రలోని కర్ణిసేన నుంచి ఎక్కువగా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి.ప్రాంతీయ ఎజెండాని ఎత్తుకొని ఒక వర్గంగా ఉన్న కర్ణిసేన తమకి వర్గానికి చెందిన రాజుల కథలని తెరపై దర్శకులు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తే కచ్చితంగా కర్ణిసేన నుంచి బెదిరింపులు, అలాగే హెచ్చరికలు ఎదురవుతాయి.
గతంలో సంజయ్ లీలా బన్సాలీ పద్మావత్ మూవీకి కర్ణిసేన పెద్ద రాద్దాంతం చేసింది.ఆ సినిమాలో తన వంశాన్ని కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని, పద్మావత్ మూవీ రిలీజ్ కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు.
అలాగే రిలీజ్ తర్వాత కూడా మూవీపై తమ వ్యతిరేకత ప్రదర్శించి ఆందోళనలు చేశారు.ఇప్పుడు అక్షయ్ కుమార్ లీడ్ రోల్ లో తెరకెక్కబోతున్న పృథ్వీరాజ్ మూవీపై కూడా కర్ణిసేన అలాంటి అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు చిత్ర దర్శక, నిర్మాతలకి గట్టి వార్నింగ్ ఇచ్చింది.
యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో ఈ భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామా మూవీ తెరకెక్కుతుంది.చంద్ర ప్రకాష్ ద్వివేది ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.
మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ ఈ మూవీలో అక్షయ్ కుమార్ కి జోడీగా నటిస్తుంది.అలాగే సంజయ్ దత్ కీలకపాత్రలో కనిపించబోతున్నాడు.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.వచ్చే ఏడాది నవంబర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే పృథ్విరాజ్ చిత్రబృందానికి వార్నింగ్ ఇచ్చింది.ఈ సినిమా విషయంలో తమకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని తెలిపింది.
వాటిని కాదని ముందుకెళ్తే.పద్మావత్ సినిమా టైమ్ లో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి పట్టిన గతే పడుతుందని హెచ్చరించింది.
చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి వివాదాలు చుట్టుముట్టాయి.టైటిల్ తో పాటు మరికొన్ని అంశాలపై కర్ణిసేన అభ్యంతరం చెబుతోంది.
పృథ్విరాజ్ అనే టైటిల్ కరెక్ట్ కాదంటోంది.మహారాజు పూర్తి పేరు పృథ్విరాజ్ అనే టైటిల్ కి చౌహాన్ కూడా కలిపి పృథ్విరాజ్ అనే టైటిల్ ను పెట్టాలని డిమాండ్ చేస్తోంది.
అలాగే సినిమాని తమకి చూపించాలని పట్టుబడుతుంది.