కర్ణాటక సీఎం యడ్యూరప్పపై ఈమధ్య రకరకాల వార్తలు వచ్చాయి.సీఎం గా యడ్యూరప్పని తొలగిస్తున్నారంటూ ఆ వార్తల సారాంశం.
యడ్యూరప్ప వర్గం ఆ వార్తలను ఖండిస్తూ వచ్చినా అవి వస్తూనే ఉన్నాయి.అయితే ఇప్పుడు ఆ వార్తలే నిజం కాబోతున్నాయని అంటున్నారు.
కర్ణాటక బీజేపీ ప్రభుత్వంలో కీలక మార్పులు జరుగనున్నాయని తెలుస్తుంది.కర్ణాటక సీఎం యడ్యూరప్ప రాజీనామాకు సిద్ధమైనట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందిన సమాచారం.
యడ్యూరప్ప ఆరోగ్య కారణాల వల్ల సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్టు తెలుస్తుంది.ఈ మేరకు పార్టీ పెద్దల నుండి బుజ్జగింపు ప్రయత్నాలు దాదాపు ఓకే అయినట్టు చెబుతున్నారు.
కర్ణాటక సీఎం పదవి నుండి యడ్యూరప్పని తొలగించి కొత్త సీఎం కు పగ్గాలు అప్పగించాలని చూస్తున్నారు.అందుకు యడ్యూరప్ప కూడా ఓకే అన్నారని తెలుస్తుంది.కొన్నాళ్లుగా కర్ణాటక ప్రభుత్వంలో అసమ్మతి గళ వినిపిస్తూనే ఉంది.ఈ నేపథ్యంలో శుక్రవారం సీఎం యడ్యూరప్ప పీఎం నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు.
శుక్రవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లి నరేంద్ర మోడీని కలిశారు యడ్యూరప్ప.
అనంతరం శనివారం బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతోనూ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.ఇక యడ్యూరప్ప రాజీనామా అనంతరం కర్ణాటక సీఎం గా కేంద్ర మంత్రి సదానంద గౌడ్ కు ఆ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తుంది.అయితే సదానంద్ కే ఇస్తారా మరెవరికైనా ఇచ్చే ఆలోచనలో ఉన్నారా అన్నది తెలియాల్సి ఉంది.