ప్రముఖ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పై కర్ణాటక ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు అందినట్లు తెలుస్తుంది.హిందూ దేవుళ్లు, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ పై ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు చేసారు అంటూ అఖిల భారత హిందూ మహాసభ ఫిర్యాదు చేసింది.
ఈ నేపథ్యంలో ఆయనను సినిమాల నుంచి బహిష్కరించాలంటూ కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలికి మహాసభ కార్యకర్తలు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది.కన్నడ సినిమాల్లో ఆయనకు అవకాశం ఇవ్వొద్దని, ఒకవేళ అయినప్పటికీ ఆయనకు అవకాశాలు కల్పిస్తే తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించినట్లు సమాచారం.
ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న సినీ నటుడు ప్రకాష్ రాజ్ సీఎం యోగి ఆదిత్యానాధ్ పై తీవ్ర విమర్శలకు దిగారు.యూపీ లో రధోత్సవానికి ముంబై నుంచి మోడళ్లను తీసుకువచ్చి వారికి సీత రామలక్ష్మణుల వేషాలు ధరింప జేశారు అంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.
దీనితో ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన హిందూ మహాసభ కన్నడ ఫిలిం ఛాంబర్ కు ఫిర్యాదు చేసింది.
ఇప్పటికే సినీ కెరీర్ కొంచం ఒడిదుడుకుల్లో ఉన్న సమయంలో ప్రకాష్ రాజ్ పై ఇలా హిందూ మహాసభ ఫిలింఛాంబర్ కు ఫిర్యాదు చేయడం తో దీని ఎఫెక్ట్ కూడా ప్రకాష్ రాజ్ పై పడే అవకాశం కనిపిస్తుంది.మరి హిందూ మహాసభ ఫిర్యాదు పై కన్నడ ఫిలింఛాంబర్ ఎలా స్పందిస్తుందో చూడాలి
.