కన్నడ ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం ఎంత సంచలనంగా మారిందో అందరికి తెలిసిందే. డ్రగ్స్ ఫ్లీడర్స్ తో లింకులు ఉన్నాయని ఆధారాలు లభించడంతో కన్నడ స్టార్ హీరోయిన్లు అయినా రాగిణి ద్వివేది, సంజనా గల్రానిని రెండు నెలల క్రితం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
వారిని అరెస్ట్ చేసిన తర్వాత కన్నడ నాట ఈ కేసులో చాలా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.ఆ తరువాత ఇద్దరు హీరోయిన్లు బెయిల్ గురించి చాలా ప్రయత్నాలు చేశారు.
అయితే బెయిల్ ఇచ్చేనందుకు కర్ణాటక హై కోర్టు అంగీకరించలేదు.దీంతో ఇన్ని రోజులు జైలు జీవితాన్నే వారు అనుభవించాల్సి వచ్చింది.
అయితే ఎట్టకేలకు సంజనకి ఆరోగ్యకారణాలతో బెయిల్ ఇచ్చేనందుకు హైకోర్టు అంగీకరించింది.అయితే బెయిల్ మంజూరు చేస్తూనే ఆమెకు కొన్ని షరతులని విధించింది.
ఎట్టి పరిస్థితిలో ఆ షరతులని ఫాలో అవ్వాలని పేర్కొంది.
బెయిల్ కోసం 3 లక్షలకు వ్యక్తిగత బాండ్ సమర్పించాలని, అంతే మొత్తానికి ఇద్దరు వ్యక్తులు సంజనకు ష్యూరిటీ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.అంతేగాకుండా నెలలో రెండుసార్లు పోలీసుల ఎదుట హాజరవ్వాలని, విచారణకు సహకరించాలని స్పష్టం చేసింది.ఈ మాదకద్రవ్యాల కేసులో సాక్ష్యాలను దెబ్బతీసేలా వ్యవహరించకూడదని పేర్కొంది.
ఈ నేపధ్యంలో ఆమె కదలికలపై కూడా నిఘా ఉంచే అవకాశం ఉందని హైకోర్టు వాఖ్యలతో స్పష్టం అవుతుంది.రేపు ఉదయం సంజన విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
అయితే ఇదే కేసులో అరెస్ట్ అయినా రాగిణీ ద్వివేదికి ఇంకా బెయిల్ మంజూరు చేయలేదు.మరి సంజనా బయటకి వచ్చాక మీడియాతో ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా, లేదా అనేది వేచి చూడాలి.