ఏంటి భారతీయులు సంవత్సరానికి అంతా జీతం తీసుకుంటున్నారా? అంతా ఎలా ఇస్తారు అని ఆశ్చర్యంగా ఉండచ్చు.మన భారతీయులే అంత జీతం తీసుకోబుతున్నారు.
కానీ బ్రిటన్ దేశం అంతా జీతం ఇవ్వనుంది.పూర్తి వివరాల్లో కి వెళ్తే.
కర్నాటక రాష్ట్రం నుంచి నిపుణులైన వెయ్యి మంది నర్సులను బ్రిటన్ దేశానికి పంపించాలి అని కర్నాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కరోనా వైరస్ కారణంగా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న జనానికి కొత్త వైరస్ స్ట్రెయిన్ ప్రపంచ దేశ ప్రజలను వణికిస్తోంది.
స్ట్రెయిన్ వైరస్ బ్రిటన్ కేంద్రంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఈ నేపథ్యంలోనే కర్నాటక రాష్ట్రం ఈ సంచలన నిర్నయం తీసుకుంది.బ్రిటిష్ దేశంలో ని ఐరోపాలో పలు దేశాల్లో భారతీయ నర్సులకు భారీ డిమాండ్ ఉంది.దీంతో భారతీయ దేశ నర్సులకు ఉపాధిని ఇచ్చేనందుకు పలు ఆసుపత్రులు ముందుకు వచ్చినట్టు ఉప ముకులమంత్రి డాక్టర్ సిఎన్ అశ్వవత నారాయణ తెలిపారు.
ఇక ఈ నేపథ్యంలోనే మొదటి విడత అయినా కర్నాటక ఒకేషనల్ ట్రైనింగ్ అండ్ స్కిల్ డెవలప్ మెంటు కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎంతో మంది నర్సులు శిక్షణ పొందారు.అందులో వెయ్యి మందిని ఎంపిక చేసినట్టు అక్కడ వారు తెలిపారు.త్వరలోనే వారిని ఇంగ్లాండ్ కు పంపించనున్నట్టు ఉప ముఖ్యమంత్రి తెలిపారు.ఆ నర్సులు అందరికి కర్నాటక ప్రభుత్వం అంతర్జాతీయ ఇమ్మిగ్రేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.బ్రిటిష్ ప్రభుత్వంలో ఈ నర్సుల వార్షిక వేతనం రూ.20 లక్షలు ఇండియన్ కరెన్సీని అందుతుందని మంత్రి వెల్లడించారు.ఈమేరకు కర్ణాటక రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి శాఖ, నేషనల్ హెల్త్ సర్వీసెస్, హెల్త్ ఎడ్యుకేషన్ ఇంగ్లాండ్ ల మధ్య ఒప్పందం కుదుర్చుకున్నారు.
తాజా వార్తలు