ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ సమయంలో వివిధ టోర్నమెంట్స్ రద్దు అవుతున్నాయి కొన్ని వాయిదా వేస్తున్నారు.ఇక త్వరలో జరుగబోతున్న ఐపీఎల్ టోర్నమెంట్ను కూడా రద్దు చేయాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ఒక్క చోట వేలాది మంది కూడే అవకాశం ఉన్న కారణంగా ఐపీఎల్ మ్యాచ్ల సందర్బంగా వందల మందికి కరోనా వ్యాప్తించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కరోనా ఎఫెప్ట్ భయం ఉన్న కారణంగా ఎవరు కూడా క్రికెట్ మ్యాచ్లకు కూడా వచ్చే అవకాశం ఉండదని కొందరు భావిస్తున్నారు.
అందుకే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే ఐపీఎల్ మ్యాచ్లను రద్దు చేయాల్సిందే అంటూ తాజాగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీసీఐని కోరింది.బెంగళూరులో మ్యాచ్లను రద్దు చేయడంతో కర్ణాటక ప్రభుత్వం పూర్తిగా ఐపీఎల్ను రద్దు చేయాలని ఈ ఏడాదికి గాను ఐపీఎల్ను వదిలేయాలంటూ బీసీసీఐకి విన్నవిస్తున్నారు.