విషాదం: తోపుడు బండిపై అంతిమయాత్ర!

పెద్దలు అంటుంటారు.చివరికి నిన్ను మోయాలి అంటే ఓ నలుగురు కావాలి అని.

 Karnataka Family Forced To Carry Body Of Deceased On Pushcart, Karnataka Family,-TeluguStop.com

కానీ కరోనా వైరస్ ఆ నలుగురును కూడా లేకుండా చేసింది.కరోనా కారణంగా బంధువులు, స్నేహితులు ఎవరు లేకుండా పోతున్నారు.

సొంత కుటుంబీకులు కరోనా కారణంగా మరణించిన వారిని ఒక్కసారి కూడా చూసుకోలేని దుస్థితి ఏర్పడింది.
ఇంకా ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.

కర్ణాటకలోని బెలగావి జిల్లాలోని అథాని ప్రాంతంలో ఓ ఇంట్లో వ్యక్తి అనారోగ్యంతో మరణించాడు.దీంతో ఆ కుటుంబ సభ్యులు వారి బంధువులకు, స్నేహితులకు చుట్టుపక్కల వారందరికీ సమాచారం అందించారు.

కానీ కరోనా వైరస్ భయంతో ఎవరు కూడా కనీసం చూడటానికి రాలేదు.

అయితే చుట్టుపక్కల వారిని అంతిమ సంస్కారాలకు సహకరించాలని వేడుకున్నప్పటికీ కరోనాతో మృతి చెందాడు ఏమో అనే బయంతో, అనుమానంతో ఎవరు కూడా కనీసం అడుగు ముందుకు వెయ్యలేదు.

దీంతో చేసేది ఏమి లేక ఓ తోపుడు బండిలో మృతదేహాన్ని పెట్టి ఆ కుటుంబ సభ్యులే అంత్యక్రియలు చేపట్టారు.ఇంకా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఓ న్యూస్ ఏజెన్సీ ట్విట్టర్ లో షేర్ చెయ్యగా ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube