కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొట్టుకున్న ఘటనకు సంబంధించి ఒక ఎమ్మెల్యేని సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటన విడుదల చేసింది.ఈగెల్టన్ రిసార్టులో మకాం చేసిన ఈ ఎమ్మెల్యేలలో ఇద్దరు గొడవపడి తన్నుకున్నారు? దీనికారణంగా… ఆనంద సింగ్ అనే ఎమ్మెల్యే ఆస్పత్రి పాలయ్యారు.మొదట కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అసలు గొడవే జరగనట్టుగా… కవర్ చేయాలనీ చూసినా … చివరికి మరో ఎమ్మెల్యే గణేష్ దీనికి బాధ్యుడని భావించి ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ ఘటనపై ఇప్పటికే ఆనంద్ ఫిర్యాదు చేయగా… పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.అయితే ఆనంద్పై తాను దాడి చేయలేదని, జారి పడటం వల్ల ఆయన గాయపడ్డారని గణేశ్ చెప్పారు.తన వల్లే ఆయన గాయపడ్డారని భావిస్తే తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన క్షమాపణ చెబుతానని గణేష్ అన్నారు.