ఇటీవల కర్ణాటక జల వనరుల శాఖ రమేష్ జర్కిహోలి ఒక మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానని లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా వార్తలు రావటం మాత్రమేకాక వీడియోలు బయటపడటంతో ఈ న్యూస్ దేశంలోనే సంచలనం సృష్టించింది.దీంతో తనపై వచ్చిన ఆరోపణలకు మంత్రి రమేష్ జర్కిహోలి తాజాగా రాజీనామా చేశారు.
రాజీనామా లేఖను కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు పంపారు.ఈ సందర్భంగా రమేష్ జర్కిహోలి మాట్లాడుతూ.
తన పై వచ్చిన ఆరోపణలు అన్నీ కూడా అవాస్తవం అని తెలిపారు.
వెంటనే దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
తాను ఎలాంటి తప్పు పాల్పడలేదని, అందువల్లే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు.తన ఫోటోలను ఉపయోగించి నీలిచిత్రాలగా చిత్రీకరించి.
ఇలాంటి వీడియోను క్రియేట్ చేశారని ఆరోపించారు.జరగబోయే దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వస్తాయని, ఎక్కడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు అంటూ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
మరోపక్క ఆరోపణలు చేసిన మహిళతో ఆయన సన్నిహితంగా మాట్లాడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.