ఏపీలో కర్మ రాజకీయం సెగలు రేపుతోంది.వైసీపీ ప్రభుత్వ తీరుపై ఇదేం కర్మంటూ టీడీపీ అదినేత చంద్రబాబు పర్యటనలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా ఏలూరు జిల్లా విజయరాయిలో ఇదేం కర్మ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.అనంతరం స్థానిక మహిళలను చంద్రబాబు పరామర్శించారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ బాబు పర్యటన కొనసాగుతోంది.యాభై రోజులు పాటు యాభై లక్షల కుటుంబాలాను కలిసేలా టీడీపీ ప్లాన్ చేసింది.