ఇటీవల రోజుల్లో రక్తహీనత బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగిపోతోంది.కారణం ఏదైనా రక్తహీనతను నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్యం మొత్తం తీవ్ర స్థాయిలో దెబ్బ తింటుంది.
అందు వల్లనే రక్త హీనతకు ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యంగా, ప్రశాంతగా ఉండొచ్చని నిపుణులు చెబుతుంటారు.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే లడ్డు సూపర్గా సహాయపడుతుంది.
మరి ఇంకెందుకు లేటు రక్తహీనతను దూరం చేసే ఆ లడ్డు ఏంటో దాన్ని ఎలా తయారు చేసుకోవాలో.? చూసేయండి.
ఖర్జూరం నువ్వుల లడ్డు.అద్భుతమైన రుచితో పాటుగా బోలెడన్ని పోషక విలువలను సైతం కలిగి ఉంటుంది.ముఖ్యంగా ఇందులో పుష్కలంగా ఉండే ఐరన్ కంటెంట్ ఎర్ర రక్త కణాలు వృద్ధి చెందేందుకు సహాయపడి.రక్త హీనతను తరిమి కొడుతుంది.
ఇక ఈ లడ్డూను చేసుకునేందుకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు.
ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు నువ్వులు వేసి స్లైట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి.
ఆ తర్వాత అర కప్పు ఖర్జూరం తీసుకుని గింజలను తొలగించాలి.ఇప్పుడు మిక్సీ జార్లో గింజ తొలగించిన ఖర్జూరాలు, వేయించి పెట్టుకున్న నువ్వులు వేసి మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి.
ఆపై ఈ మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి, ఎండు కొబ్బరి పొడి, జీడిపప్పు పలుకులు, బాదం పప్పు పలుకులు వేసి బాగా మిక్స్ చేసి.లడ్డూలు మాదిరి చుట్టుకుంటే సరిపోతుంది.
ఈ ఖర్జూరం నువ్వుల లడ్డూలను డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటాయి.రోజుకు ఒకటి చప్పున ఈ లడ్డూలను తీసుకుంటే రక్త హీనత పరార్ అవ్వడమే కాదు.
మళ్లీ మళ్లీ దరి దాపుల్లోకి రాకుండా కూడా ఉంటుంది.