బాలీవుడ్ లో సెలబ్రెటీలుగా ఉన్నవారు రిలేషన్ షిప్ లోకి ఎంత ఈజీగా వెళ్తారో అంతే ఈజీగా బ్రేక్ అప్ కూడా చెప్పేసుకుంటారు.అక్కడ లాగ్ టర్మ్ రిలేషన్ కంటే షార్ట్ టర్మ్ రిలేషన్స్ ఎక్కువగా ఉంటాయి.
గతంలో చాలా మంది హీరో, హీరోయిన్లు ఒకరిని ఒకరు పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు.అయితే ప్రెజెంట్ మాత్రం ఏ సెలబ్రెటీ ఎవరితో ఎప్పుడు రిలేషన్ లో ఉంటుందో తెలియడం లేదు.
ఇద్దరు కలిసి ఉన్నారు అనుకునే లోపే ఆ ఇద్దరు వేరొక ఇద్దరితో వీడివిడిగా కనిపిస్తారు.ఇదిలా ఉంటే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న నటి కరిష్మాకపూర్.
ఈమె ఎన్నో హిట్ చిత్రాలలో నటించడంతో పాటు స్టార్ హీరోలతో ఆడిపాడింది.కమర్షియల్ హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో సంజయ్ కపూర్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
అతనితో పదేళ్ల కాపురం చేసి విడాకులు తీసుకుంది.తాజాగా తన మాజీ భర్త గురించి కరిష్మా కపూర్ సంచలన ఆరోపణలు చేసింది.
విడాకుల తర్వాత ఇప్పటి వరకు తన జీవితం గురించి గుట్టువిప్పని ఆమె మొదటి సారి ఓ ఇంటర్వ్యూలో పెళ్లి తర్వాత ఎలాంటి జీవితాన్ని అనుభవించిందో తెలియజేసింది.తన జీవితంలో చేసిన పెద్ద తప్పు పెళ్లి చేసుకోవడమే అని, ఎందుకంటే పెళ్లి తర్వాత ప్రతిరోజూ బాధ పడుతూనే ఉన్నానని కరిష్మా కపూర్ చెప్పింది.అందరి జీవితంలో హనీమూన్ అనేది మధుర ఘట్టం అయితే తన జీవితంలో మాత్రం అదో చెత్త జ్ఞాపకాలలో ఒకటి.
పెళ్లైన వెంటనే తనను సంజయ్ కపూర్ తనను హింసించడం మొదలు పెట్టాడని, మరీ ముఖ్యంగా స్నేహితులలో తనను పడుకోమని బెదిరించేవాడని, మానసికంగా, శారీరకంగా హింసించేవాడని సంచలన ఆరోపణలు చేసింది అందుకు తాను నిరాకరించడంతో కొట్టాడని, హనీమూన్లో తనను వేలం వేసి తన స్నేహితులకు ధరను కోట్ చేశాడని తీవ్ర ఆరోపణలు కరిష్మా కపూర్ తీవ్ర ఆరోపణలు చేసింది.అలాంటి నరకం పదేళ్లకు పైగానే చూసానని చెప్పింది ఈమె.తనతో వివాహం అయిన తర్వాత కూడా సంజయ్ తన మొదటి భార్యతో శారీరక సంబంధం కొనసాగించాడని చెప్పింది.ఆమె వాఖ్యలపై మాజీ భర్త సంజయ్ కపూర్ ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి.