ప్రస్తుతం కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే భారత దేశంలో 114 మంది మరణించగా దాదాపు నాలుగు వేల మందికి పైగా ఈ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారు.
బాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ సినీ నిర్మాత కూతురు కూడా ఈ కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినందువల్ల ఆమెను వెంటనే ఆస్పత్రికి చేర్పించినట్లు సమాచారం.
వివరాల్లోకి వెళితే బాలీవుడ్ లో పలు ప్రతిష్టాత్మక చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించినటువంటి కరీమ్ మోరాని కూతురు ఇటీవలే వ్యక్తిగత పనుల నిమిత్తం ఇతర దేశాలకు వెళ్లి వచ్చింది.
అయితే ఇటీవల ఆమెకు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు వైద్యుల సమక్షంలో నిర్వహించగా పాజిటివ్ అని తేలిందని నిర్మాత కరీమ్ మోరాని తెలిపారు.దాంతో తన కుటుంబ సభ్యులకి కూడా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిపించారని అందువల్ల అందరూ తమంతట తామే స్వయంగా స్వీయ నిర్బంధంలోకి వెళుతున్నట్లు తెలిపారు.
అయితే బాలీవుడ్ లో మంచి విజయాలు సాధించినటువంటి చెన్నై ఎక్స్ ప్రెస్, రావణ్, తదితర చిత్రాలుకు కరీమ్ మోరానినిర్మించాడు.ఐతే బాలీవుడ్ కి సంబంధించినటువంటి మరో రెండు కొత్త చిత్రాలకి కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
అయితే ప్ర్తస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టేందుకు గానూ లాక్ డౌన్ కారణంగా ఈ చిత్రాల చిత్రీకరణ పనులు నిలిపివేశారు.